టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డేకి గత ఏడాది ఏ మాత్రం కలిసి రాలేదు. ఈ బ్యూటీ నటించిన నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. అయినా సరే ఈ అమ్మడి జోరు ఏమాత్రం తగ్గలేదు.
ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబుకు జోడిగా త్రివిక్రమ్ దశకత్వంలో `ఎస్ఎస్ఎంబి 28`లో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో `కిసీ కా భాయ్ కిసీ కా జాన్` అనే మూవీ చేసింది. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.
రంజాన్ కానుకగా ఏప్రిల్ 21న ఈ మూవీ ప్రేక్షకులను అలరించబోతోంది. ఇందులో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రను పోషించగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్ లో మెరిస్తారు.
ఇదిలా ఉంటే.. పూజా హెగ్డే తాజా ఫోటో షూట్ నెట్టింట దుమారం రేపుతోంది. వైట్ కలర్ టైట్ డ్రెస్ లో దర్శనమిచ్చిన పూజా హెగ్డే.. తన అందాలతో టెంప్ట్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
బిగుతైన బట్టల్లో షాపులు చూపిస్తూ అరాచకం సృష్టించింది. పరువాల విందుతో కుర్రకారును పరేషాన్ చేసింది. పూజ హెగ్డే తాజా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.