స్పెషల్.. అంటూ అతనీ గురించి పోస్ట్ చేసిన నిహారిక..షాక్ లో ఫ్యాన్స్..!!

తెలుగు సినీ పరిశ్రమలో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్యకాలంలో నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉంది. గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి తన భర్తతో విడాకులు తీసుకోబోతోంది అంటు తెగ వైరల్ గా మారుతోంది. ఇలా నిహారిక తన భర్తకు దూరంగా ఉండడంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న ఇప్పటివరకు ఈ విషయం పైన ఎవరు స్పందించలేదు.

ఇన్ని రోజులపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న నిహారిక విడాకులు వార్తలతో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గానే ఉంటూ తనకు సంబంధించిన విషయాలను సైతం షేర్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా ఈమె ఈ మధ్యకాలంలో కాస్త బోల్డ్ ఫోటో షూట్లకు కూడా ఫోజులు ఇస్తు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి కొంతమంది మెగా కుటుంబం పరువు తీస్తున్నారంటూ మండిపడుతున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రముఖ ఫోటోగ్రాఫర్ పుట్టినరోజు కావడంతో తనతో కలిసి దిగిన ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది.

ఫోటో గ్రాఫర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. యు ఆర్ వెరీ స్పెషల్ అంటూ ఫోటోగ్రాఫర్కు శుభాకాంక్షలు చెబుతూ చేసినటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.. నటనకు దూరంగా ఉంటూ పలు సినిమాలను నిర్మిస్తున్న నిహారిక ఇప్పటికే ఇమే పింక్ ఎలిఫెంట్ పిక్చర్ అనే బ్యానర్ను స్థాపించింది. హైదరాబాదులో ఒక ఆఫీసును కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక ఫోటో వైరల్ గా మారుతోంది.