`యశోద` విడుదలకు వారం రోజుల ముందు సమంత మయోసైటిస్ అనే ప్రణాంతక వ్యాధి బారిన పడ్డానంటూ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. నిలబడటానికి కూడా కష్టంగా ఉందంటూ తన ఆరోగ్య పరిస్థితి సోషల్ హీడియా ద్వారా పంచుకుంది. దాంతో అభిమానులతో పాటు నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు ఆమెకు అండంగా నిలిచారు.
సమంత త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఈ క్రమంలోనే సింపతీ బాగా ఏర్పడింది. అది యశోదకు బాగా కలిసొచ్చింది. సినిమా సూపర్ హిట్ అయింది. అదే సింపతీ ప్లాన్ శాకుంతలం మూవీకి కూడా వాడే ప్రయత్నం చేసింది. ప్రమోషన్స్ లో కళ్ళకు పెద్ద అద్దాలు, టిష్యూ పేపర్ తో ముక్కు చీదుకుంటూ, దగ్గుతూ, కనీస ఓపిక లేని విధంగా సమంత కనిపించింది. పదే పదే తన అనారోగ్యం గురించి ప్రస్తావించింది. విడుదలకు రెండు రోజుల ముందు కూడా సమంత తనకు జ్వరం సోకినట్లు ట్వీట్ చేసింది. అయినాసరే శాకుంతలం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లాపడింది.
ఇకపోతే సమంత తాజాగా లండన్ లో మెరిసింది. సిటాడెల్ వరల్డ్ ప్రీమియర్ ప్రమోషన్స్ లో ఆమె పాల్గొన్నారు. అల్ట్రా స్టైలిష్ లుక్ మైండ్ బ్లాక్ చేయడమే కాదు.. సూపర్ యాక్టివ్ గా కనిపించింది. చిట్టిపొట్టి దుస్తుల్లో జాలీగా గడుపుతోంది. దీంతో నెటిజన్లు సమంతను ఏకేస్తున్నారు. అనారోగ్యం అంటూ సమంత నాటకం ఆడిందని.. ఇప్పుడు ఆమె బండారం మొత్తం బయటపడిందని మండిపడుతున్నారు. జ్వరం, తీవ్ర నీరసమని చెప్పిన సమంత విదేశాలకు ఎలా వెళ్లింది..? హైదరాబాదులో ఉన్న అనారోగ్య సమస్యలు లండన్ వెళ్లేప్పటికీ ఏమయ్యాయి..? అంటూ సమంతను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.