బుల్లితెరపై ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో వల్ల ఎంతోమంది ఆకలిని తీర్చింది. అలాగే ఈ మధ్యకాలంలో చాలా మంది కొత్త కమెడియన్స్ వస్తూనే ఉన్నారు.. అయితే అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రచ్చ రవి ఇప్పుడు లేరు. ఈ షో ద్వారా ఈయనకు ఎంత గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆయన నటించిన బలగం సినిమాతో మంచి పాపులారిటీని ప్రేక్షకుల్లో సంపాదించుకున్నాడు.
ఆ సినిమాలో ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయిపోయాడు రచ్చ రవి.ఆ డైలాగు ఏమిటంటే ఆగుతావా రెండు నిమిషాలు ఈ డైలాగు గురించి రచ్చ రవి మాట్లాడుతూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. బలగం సినిమాలో ఈ డైలాగుతో నేను ఎంతో ఫేమస్ అయ్యానని అంతేకాకుండా 10 సంవత్సరాల క్రితం ఇలాంటి ఒక డైలాగుతోనే జబర్దస్త్ షోలో పాపులారిటీని సంపాదించుకున్నానని
అప్పట్లో చమక్ చంద్ర తో” తీసుకోలేదా రెండు లక్షల కట్నం అనే డైలాగుతో” అప్పట్లో మంచి ఇమేజ్ను పెంచుకున్నాను. మరి ఇప్పుడు ఇలాంటి డైలాగుతో ప్రేక్షకుల్లో స్థిరపడిపోయాను అంటూ తెలిపారు. పది సంవత్సరాల క్రితం మార్చి నెలలో నేను ఫేమస్ అయ్యాను.ఇప్పుడు బలగం సినిమాతో మార్చిలో మళ్లీ ఫేమస్ అయ్యాను.ఈ రెండు డైలాగులు తన జీవితాన్ని మార్చేశాయని రచ్చ రవి చెప్పుకొచ్చాడు.
అప్పట్లో చమక్ చంద్ర టీమ్ లో ఆ డైలాగ్ పాపులర్ కావడంతో..మల్లెమాల వారి నుంచే కాకుండా.. చాలామంది నుంచి ఫోన్లు చేసి ప్రశంసించారని తెలిపారు. ఇప్పుడు కూడా ఈ డైలాగుతో చాలామంది ఫోన్లు చేసి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఈ రెండు డైలాగులతో నేను ఫేమస్ అయినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటానని నా బలం.. బలగం అన్నీ మీరే కాబట్టి మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను అంటూ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు.