టాలీవుడ్ లో హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమంత మొదట పలు యాడ్లలో నటించింది..ఆ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ఈ ముద్దుగుమ్మ ఈ రోజున 37వ పుట్టినరోజు సందర్భంగా ఈమె గురించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. మొదట గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏం మాయ చేసావే సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమయ్యింది.
ఏం మాయ చేసావే సినీమాలో సమంత అందానికి కుర్రకారులు ఫిదా అయ్యారు. తన మొదటి చిత్రంతోనే కుర్రకారులను బాగా ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ.మొదట నటుడు సిద్ధార్థ ఈమె ప్రేమాయణం నడిపినట్లుగా వార్తలు వినిపించాయి. కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడిపోవడం జరిగింది.. ఆ తరువాత నాగచైతన్యను ప్రేమించి మరి వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పలు సినిమాలలో నటించింది. ఇదే క్రమంలో బాలీవుడ్లో అడుగుపెట్టి కెరియర్ పీక్స్ లో ఉండగానే ప్రేమించిన నాగచైతన్యను వివాహం చేసుకొని అక్కినేని కోడలిగా పేరు సంపాదించింది. అయితే ఆ పేరును ఎక్కువ రోజులు మెయింటైన్ చేయలేకపోయింది సమంత. పెళ్లయిన 4 ఏళ్లకే విడిపోవడం జరిగింది.
సమంత కెరీర్లు ఊహించని విధంగా మలుపులు తిరిగాయి మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడడంతో ఈమె చాలా కృంగిపోయింది. దీంతో కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న సమంత కోల్పోవడానికి చాలా సమయం పట్టింది. తన తల్లిదండ్రుల నుంచి కూడా దూరంగా ఉంటున్నట్లు సమాచారం.తన ఆరోగ్యపరంగా కెరియర్ పరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. అయినప్పటికీ తన ఆరోగ్యం కుదుటపడలేదు. ప్రస్తుతం హైపర్ భారీక్ ఆక్సిజన్ థేరపి తీసుకున్నట్లు తెలియజేస్తోంది. సమంత కెరీర్లు నాగచైతన్య నుండి విడిపోవడం అసలు ఇష్టం లేదు. ఇక ఈమె తల్లిదండ్రులకు సమాధానం ఇలా చూసి చాలా బాధపడిపోయిన్నట్లు సమాచారం.