వెండితెరపై ఎన్నో అద్భుత ప్రేమ కథ చిత్రాలు తెరకెక్కించి మంచి విజయాలు అందుకున్నాయి.. అలా ఆడియన్స్ కి ఇప్పటికీ చెరిగిపోని ముద్రగా వేసుకున్న చిత్రాలలో మనసంతా నువ్వే చిత్రం కూడా ఒకటి.. ఈ చిత్రాన్ని ఎమ్మెస్ రాజు నిర్మాతగా.. విఎన్ ఆదిత్య దర్శకత్వంలో వహించిన ఈ చిత్రం 2001లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది.ఇందులో దివంగత హీరో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన హీరోయిన్గా రీమాసేన్ నటించగా తనికెళ్ల భరణి, సునీల్, తను రాయ్ చంద్రమోహన్ కీలకమైన పాత్రలో నటించడం జరిగింది.
ఈ సినిమాకి సంగీతాన్ని మాత్రం ఆర్పి పట్నాయక్ అందించారు ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటాయి.అయితే ఈ సినిమాలో అందం అభినయంతో మెప్పించిన రీమాసేన్ ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి బాగానే సక్సెస్ అయ్యింది కానీ ఎందుకో కొన్ని కారణాల చేత ఇండస్ట్రీకి దూరమైంది. మరి ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఏం చేస్తోంది ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం.
రీమాసేన్ 1981 అక్టోబర్ 29న కోల్కతాలో జన్మించింది.. అక్కడే తన విద్యాభ్యాసాన్ని కూడా పూర్తి చేసింది. నటనపై ఆసక్తి ఉండడంతో మోడలింగ్ వైపు వెళ్ళింది అలా అనేక రకాల ప్రకటనలు నటించిన తర్వాత మనసంతా నువ్వే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇదే ఈమెకు మొదటి సినిమా. ఇక ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టింది బాలీవుడ్లో పెద్దగా సక్సెస్ కాలేక పోయింది.
తెలుగు, హిందీ, తమిళ్ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఈమె నటించిన రెండు చిత్రాలు అక్కడ బాగా ఆకట్టుకున్నాయి. తెలుగు తమిళంలో పాటు ఇతర భాషలలోని చిత్రాలలో నటించిన రీమాసేన్ 2012లో వ్యాపారవేత్త శివ్ కరణ్ ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఇమే పూర్తిగా సినిమాలకు దూరమయ్యింది. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ముంబైలో నివసిస్తున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు యాక్టివ్గానే ఉంటుంది ప్రస్తుతం ఇమెకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.