తెలుగు సినీ ఇండస్ట్రీలో అచ్చ తెలుగు అమ్మాయిగా పేరుపొందిన హీరోయిన్లలో లయ కూడా ఒకరు. చైల్డ్ యాక్టర్ గా పలు సినిమాలలో నటించిన ఈమె ఆ తర్వాత స్వయంవరం అనే సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది.తన మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస సినిమాలలో నటించింది. అలా ఒకే ఏడాదిలోనా దాదాపుగా పది సినిమాలలో నటించిన ఈమె మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
కెరియర్ పిక్స్ రేంజ్ లో ఉన్న సమయంలో ఈమె గణేష్ గోగుర్తి అనే వ్యక్తిని వివాహం చేసుకొని సినీ ఇండస్ట్రీకి దూరమయింది.ఇప్పుడు మీడియాకు కూడా పెద్దగా కనిపించలేదు.. చాలాకాలం తర్వాత ఈమె మీడియా ముందుకు వచ్చి పలు ఇంటర్వ్యూలు ఇచ్చినట్లు తెలుస్తోంది. లయ మాట్లాడిన మాటలు చాలా వైరల్ గా మారుతున్నాయి. లయ భర్త గణేష్ కూడా ఒక పారిశ్రామికవేత్త అని అతనికి ఉన్న ఆస్తులు వేల కోట్ల రూపాయల లోనే ఉంటాయని సోషల్ మీడియాలో పలుకు కథనాలు వినిపిస్తున్నాయి.
తాజాగా లయ తాను పనిచేస్తున్న కంపెనీలో దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. లయ అమెరికాలో కాలిఫోర్నియాలో జోబి ఏవిమేషన్ ఏరో స్పీక్ కంపెనీలో ఐటీ ఇంజనీరింగ్ గా పని చేస్తున్నట్లు తెలియజేసింది లయ. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో దశాబ్ద కాలం పాటు హీరోయిన్ గా నటించిన ఈమె చెస్ లో కూడా ఏడుసార్లు జాతీయస్థాయిలో పాల్గొనిందట. లయ భర్త కూడా అమెరికాలో ఒక డాక్టర్. లయకు ఒక కూతురు కుమారుడు, కుమార్తె.. ప్రస్తుతం 9వ తరగతి చదువుతూ ఉండగా కుమారుడికి 12 ఏళ్లు అన్నట్లుగా సమాచారం. అప్పుడప్పుడు కూతురుతో కలిసి లయ చేస్తున్నటువంటి రీల్స్ అందరిని బాగా ఆకట్టుకుంటున్నాయి.