ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా `శాకుంతలం` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయింది. ఈ సంగతి పక్కన పెడితే సమంతపై తాజాగా ప్రముఖ డైరెక్టర్ శివ నాగేశ్వరరావు హాట్ కామెంట్స్ చేశారు.
2010లో విడుదలైన సూపర్ హిట్ మూవీ ‘ఏ మాయ చేసావే’తో సమంత సినీ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. అయితే నిజానికి సమంతను తాను ఇండస్ట్రీకి పరిచయం చేయాల్సింది అంటూ డైరెక్టర్ శివ నాగేశ్వరరావు వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. “సమంత అప్పుడు చెన్నైలోని సెయింట్ మేరీస్ కాలేజీలో చదువుతోంది. `నిన్ను కలిసాక` సినిమా ఆడిషన్ కోసం ఆమెను హైదరాబాద్ రమ్మని పిలిస్తే వచ్చింది. ఆడిషన్ మిగిశాక సమంతను చెన్నై పంపిద్దామంటే ఫ్లైట్ టికెట్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
ఆ మరుసటి రోజు కాస్త తక్కువగా ఉన్నాయి. దీంతో ఈ ఒక్క నైట్ హైదరాబాద్లో ఉండమని అడిగాం. కానీ, ఆమె నో చెప్పింది. చేసేదేమీ లేక మా టీమ్ బోలెడన్ని డబ్బులు పోసి టికెట్ బుక్ చేసి ఆమెను అదే రోజు చెన్నైకి పంపించింది. ఇక ఆడిషన్ నచ్చి హీరోయిన్ గా చేయమని కోరగా ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది. అంత బడ్జెట్ లేకపోవడంతో మేమే వెనక్కి తగ్గాం“ అంటూ శివ నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. ఈయన కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.