మ‌హేష్ కు అలా చేయాలంటేనే భ‌యం.. ప‌రువు మొత్తం తీసేసిన గుణ‌శేఖ‌ర్‌!

`శాకుంతలం` మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ గుణశేఖర్.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మాట్లాడారు. ఈ క్ర‌మంలోనే ఆయన భ‌యాలు బ‌య‌ట‌పెట్టి పరువు మొత్తం తీసేశారు. గుణశేఖర్ మహేష్ బాబు కాంబినేషన్ లో తొలిసారి `ఒక్కడు` సినిమా వచ్చింది. ఇందులో భూమిక హీరోయిన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాంతో కలిసి ఇద్దరు వరుసగా సినిమాలు చేశారు.

ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన `అర్జున్` సినిమా కూడా మంచి విజయం సాధించింది. అయితే మూడో ప్రయత్నం మాత్రం బెడిసికొట్టింది. మహేష్ హీరోగా గుణశేఖర్ తెర‌కెక్కించిన హ్యాట్రిక్ మూవీ `సైనికుడు` డిజాస్టర్ గా నిలిచింది. ఆ త‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసి వ‌ర్క్ చేయ‌లేదు. ఇక తాజాగా మహేష్ గురించి గుణ‌శేఖ‌ర్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను రివీల్ చేశారు.

మహేష్ కి లుంగీ కట్టాలంటే మ‌హా సిగ్గు అంటూ గుణ‌శేఖ‌ర్ తెలిపారు. అలాగే పోలీస్ పాత్రలు చేయాలంటేనే మహేష్ చాలా భయపడే వాడ‌ని.. అసలు పోలీస్ గెటప్ అంటేనే ససేమీరా అనే వాడని గుణ‌శేఖ‌ర్ పేర్కొన్నారు. పోకిరి చిత్రానికి ముందు వరకు చాలా పోలీస్ స్టోరీస్ రిజెక్ట్ చేశాడ‌ని.. పోలీస్ గెటప్ ని ఏదో మారు వేషంలా ఫీల్ అవుతాడని గుణశేఖర్ అన్నారు. అయితే నిజంగానే పోకిరికి ముందు మహేష్ పోలీస్ గా కనిపించలేదు. పోకిరిలో కూడా జస్ట్ కొన్ని షాట్స్ లో మాత్ర‌మే యూనిఫార్మ్ లో కనిపిస్తాడు. అయినాస‌రే ఈ మూవీ హిట్ అయింది. అలాగే ఆ త‌ర్వాత మ‌హేష్ పోలీస్ పాత్ర‌లో చేసిన ఆగడు, దూకుడు చిత్రాలు కూడా మంచి విజ‌యం సాధించ‌డం గ‌మ‌నార్హం.