సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్.. ముఖ్యంగా కామెడీని మించిన ఎంటర్టైన్మెంట్ అసలు ఏది ఉండదని చెప్పవచ్చు. ఎంత సీరియస్ సినిమా అయినా సరే ఖచ్చితంగా అందులో కామెడీ సన్నివేశాలు లేకపోతే ప్రేక్షకులు అసలు ఆ సినిమాని పట్టించుకోరు.. అందుకే ఆనాటి నుంచి నేటి వరకు కమెడియన్స్ సెపరేట్ గా పాత్రలు ఉంటాయి.. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ట్రెండు మారిపోతూనే ఉంది. సీరియస్ కథలకు ప్రేక్షకులు ఎక్కువగా బ్రహ్మరథం పడుతున్నారు.
ఈ మధ్యకాలంలో సీరియస్ సినిమాలు ఎక్కువగా అవుతున్నాయి. దీంతో కమెడియన్స్ కూడా తమ రూటు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన కామెడీతో ఆడియన్స్ ను నవ్వించగలిగిన కమెడియన్స్ ఇప్పుడు ఏకంగా భయపెడుతున్నారు.. మరి కొంతమంది నవ్విస్తూ ఏడిపిస్తూ రకరకాలుగా నవరసాలను పండిస్తూ వావ్ అనిపించుకుంటున్నారు. ఇలాంటి వారిలో ముందుగా బ్రహ్మానందం దాదాపుగా మూడు దశాబ్దాల పాటు విరామం లేకుండా కామెడీతో పండించిన బ్రహ్మానంద ఈ మధ్యకాలంలో పెద్దగా కామెడీతో ఆకట్టుకోలేక పోయారు. సడన్గా నవ్వుకు బ్రేకు ఇచ్చి రంగమార్తాండ సినిమాలో చక్రపాణిగా సీరియస్ పాత్రలో నటించి తనలోని ఉండే కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయడం జరిగింది.
ఇక మరొక నటుడు సునీల్ ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన సునీల్ ఆ తర్వాత అందాల రాముడు సినిమాతో కూడా హీరోగా మారారు. పుష్ప చిత్రంతో ఏకంగా ఒక్కసారిగా విలన్ అవతారంతో అందరిని భయపడి ఇస్తున్నారు సునీల్.
మరొక నటుడు అల్లరి నరేష్.. అల్లరి నరేష్ మొదటి నుంచి కామెడీ సినిమాలతో బాగా ఆకట్టుకున్న నరేష్ తలహవా బాగా కొనసాగించారు .. ఒకానొక సమయంలో కెరియర్లో కామెడీ సినిమాలతో సక్సెస్ కాలేకపోవడంతో ఒక్కసారిగా నాంది సినిమాతో సీరియస్ పాత్రలకు శ్రీకారం చుట్టారు. ఇక అప్పటినుంచి ఎక్కువగా ఆ పాత్రలే చేస్తూ ఉన్నారు.
ఇక వీరి బాటలోనే కమెడియన్ ప్రియదర్శి, కోవై సరళ, సత్యం రాజేష్ తదితర నటీనటులు సైతం కామెడీ ని వదిలి.. సరికొత్తదనానికి పయనమయ్యారు.