ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలతో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు `రావణాసుర` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అయ్యాడు. మర్డర్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది.
ఫరియా అబ్దుల్లా, సుశాంత్, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ, దక్షా నాగర్కర్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ల పై అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశారు.
అయితే విడుదలకు ముందు సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి ఊహించని షాక్ ఇచ్చాడు. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇస్తారని మూవీ టీం ఆశించింది. కానీ వాళ్ళ అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ చిత్రంలో వయొలెన్స్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటం వల్ల ఏ సర్టిఫికేట్ జారీ చేశారని తెలుస్తోంది. అయితే ఏ సర్టిఫికెట్ ఉన్న సినిమాలకు మల్టిప్లెక్స్ లలో 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఎంట్రీ లేదనే విషయం తెలిసిందే. దీని కారణంగా రావణాసుర సినిమా ఎంతోకొంత నష్టాలను చూడక తప్పదని అంటున్నారు.