Breaking: డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై ఐటి రైడ్..!

టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అంతటి క్రేజ్ అందుకున్న డైరెక్టర్లలో సుకుమార్ కూడా ఒకరు. సుకుమార్ ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అల్లు అర్జున్ పుష్ప చిత్రాన్ని తెరకెక్కించి పాన్ ఇండియా డైరెక్టర్గా కూడా పేరు సంపాదించారు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మొదటి భాగం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దాదాపుగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకున్నట్లు సమాచారం.

Box-office numbers for Pushpa are overwhelming, says director Sukumar -  Telangana Today

టాలీవుడ్లోకి మొదట ఆర్య సినిమాతో డైరెక్టర్ పరిచయమైన సుకుమార్..ఆ తర్వాత మహేష్ ,ఎన్టీఆర్, రామ్ చరణ్ తదితర హీరోలతో కలిసి పనిచేయడం జరిగింది. సుకుమార్ ఎన్నో చిత్రాలకు రైటింగ్ కూడా అందించడం జరిగింది.అలా అందించి కూడా మంచి విజయాలను అందుకున్నారు. ముఖ్యంగా సుకుమార్ శిష్యులు కూడా డైరెక్టర్ గా ఉంటూ మంచి విజయాలను అందుకుంటు ఉన్నారు. పుష్ప -2 చిత్రానికి గాను సుకుమార్ భాగస్వామ్యం అయ్యారని అలాగే రెమ్యూనరేషన్ విషయంపై కూడా పలు వార్తలు వినిపించాయి. ఈ కారణంగానే సుకుమార్ ఇంటి పైన తాజాగా ఐటి రైట్స్ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఏది ఏమైనా పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పేరు సంపాదించడంతో మంచి పాపులారిటీ సంపాదించారు సుకుమార్. ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇలా ఐటి రైట్స్ జరగడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఫ్లాపుల్లో ఉన్న ఎంతోమంది హీరోలకు సైతం తన దర్శకత్వంలో సినిమాలను తెరకెక్కించి మంచి విజయాలను అందించారు సుకుమార్.

https://twitter.com/sairaaj44/status/1648550485438152711?s=20