బాలీవుడ్ సూపర్ స్టార్ గా అమితాబచ్చన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తన కొడుకు అభిషేక్ బచ్చన్ తన కోడలు ఐశ్వర్యారాయ్ గురించి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. అయితే ఈ మధ్యకాలంలో అభిషేక్ బచ్చన్ కూతురు ఆరాధ్యకి హెల్త్ బాగాలేదని కొన్ని యూట్యూబ్ చానల్స్ ద్వారా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే వాటిపై ఆరాధ్య హైకోర్టు ను ఆశ్రయించింది. నా ఆరోగ్యం పై లేని పోనీ తప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు కొన్ని యూట్యూబ్ చానల్ల పై చర్య తీసుకోవాలని కోర్టును కోరారు.
ఈ వార్తపై ఏప్రిల్ 20న విచారం జరగనుంది. అయితే ఈ విషయంపై బాలీవుడ్ టైమ్ బాలీవుడ్ చింగారి వంటి యూట్యూబ్ ఛానల్ను ఇందులో చేర్చారు. అంతేకాకుండా ఆరాధ్యపై చేసిన పది యూట్యూబ్ ఛానల్ ఆమె గురించి వీడియోలు డిలీట్ చేయాలని తెలియజేస్తోంది.. ఇలాంటి నకిలీ వార్తల వల్ల కుటుంబ ప్రతిష్టలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరాధ్య పిటిషన్ లో తెలుపుతోంది.
ఇక ఈ పిటీషన్ను ఆరాధ్య ఆనంద్ నాయక్ ద్వారా దాఖలు చేశారు. డిసెంబర్ 2021 లో ఆరాధ్య తన తండ్రి అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం పై ఘాటైన సమాధానం ఇచ్చారు. నేను సెలబ్రెటీ ని కాబట్టి నా పైన వచ్చే విమర్శలను నేను సహించగలను. కానీ ఆరాధ్యను ఇందులోకి లాగటం నేను సహించలేను. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే నా ముందుకు వచ్చి చెప్పండి అంటూ గాటుగా స్పందించారు.
ఆరాధ్య తన తల్లిదండ్రులతో అప్పుడప్పుడు కొన్ని ఈవెంట్లలో కనిపిస్తూ ఉంటుంది. అలా కనిపిస్తుంటే చాలామంది ఆరాధ్య స్కూల్ కి వెళ్తుందా లేదా.. అన్ని సెలవులు ఎలా వస్తాయి..అంటూ నేటిజన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. దానికి సమాధానంగా అభిషేక్ ఇప్పట్లో శని,ఆదివారాలు ప్రతి స్కూళ్లకు సెలవులు ఉన్నాయి. అంటూ ఈ విషయంపై టోల్స్ చేయడం మానేయండి అంటూ ఫైర్ అవడం జరుగుతోంది. అంతేకాకుండా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ విడిపోతున్నారని వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి.