టాలీవుడ్ లో ప్రముఖ నటుడు శరత్ కుమార్ అనారోగ్య సమస్య కారణంగా ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా ఈయన ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు శుక్రవారం రోజున హైదరాబాదుకి తరలించడం జరిగింది. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నారు శరత్ కుమార్.
కొన్ని గంటలు గడిస్తే తప్ప ఈయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయం అంచనా వేయలేమని వైద్యులు తెలుపుతున్నారు. ఈరోజు సాయంత్రానికి డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేసి అవకాశం ఉందని ఆయన సన్నిహితుల వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. నటుడుగా శరత్ బాబు ఎన్నో చిత్రాలలో నటించారు తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం శరత్ బాబు నటించిన మళ్లీ పెళ్లి సినిమా కూడా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది.ఇందులో కృష్ణ గారి పాత్రలో నటించినట్లు సమాచారం.
ఆయన అనారోగ్య బారిన పడడంతో చిత్ర యూనిట్ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అభిమానులు సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. శరత్ బాబు చెన్నై తో పాటు హైదరాబాదులో కూడా ఉంటున్నారు తనకున్న షూటింగ్లను బట్టి అక్కడక్కడ సందర్శిస్తూ ఉంటారు. హైదరాబాదులో సొంతగా ఒక ఇల్లు ఉంది అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న శరత్ బాబు నరేష్ కోరిక మేరకు కేవలం మళ్ళీ పెళ్లి సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.