ఆరోగ్యంపై మరొకసారి క్లారిటీ ఇచ్చిన సమంత..!!

హీరోయిన్ సమంత తెలుగు రాష్ట్రాలలోని ప్రేక్షకులకు సుపరిచితమే.. స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోందని చెప్పవచ్చు. సమంత గడచిన కొద్దీ నెలల నుంచి మయో సైటిస్ వ్యాధిన బారిన పడ్డ సంగతి అందరికీ తెలిసిందే.. ఈ విషయాన్ని సమంతనే స్వయంగా తెలియజేయడం జరిగింది. తాజాగా సమంత ఇప్పుడు ఇదే హెల్త్ పై పలు అప్డేట్లను తెలియజేసింది.

సమంత మాట్లాడుతూ ఇప్పుడు అంతా పర్ఫెక్ట్ గా ఉందంటూ ఒక ఇంటర్వ్యూలో తెలియజేస్తోంది. ఇందులో తన హెల్త్ కామెంట్స్ గురించి కూడా తెలిపింది సమంత. శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హెల్త్ పైన పలు వాక్యాలు చేసింది. ఒకప్పుడు అడుగు తీసి అడుగు వేయలేని సమంత ఇప్పుడు బయటికి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చే స్టేజిలో రావడం నిజంగా విశేషం అని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు అన్ని విధాలుగా సెట్ అయ్యానని తెలియజేస్తోంది. గత ఇంటర్వ్యూ సమయంలో పలు విషయాలను సగంలో ఉన్నాయని ఇప్పుడు వాటన్నిటిని దాటేశానని తెలియజేస్తోంది సమంత.

గత ఏడాది అక్టోబర్ లో సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలియజేసింది.ఇలా ఇప్పుడు బయటికి వచ్చి శాకుంతలం సినిమా ప్రమోషన్స్ చేయడం చాలా సంతోషంగా ఉందని శాకుంతలం మూవీకి తాను అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఉన్నానని అప్పుడు కూడా ఇలాగే మూవీ కోసం ఇంటర్వ్యూ చేశాను అందులో తన వ్యాధి గురించి చెబుతూనే ఇప్పటికింకా నేను చావలేదు అంటూ చేసిన కామెంట్లు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.. యశోద సినిమా బరువు అంతా తన భుజాల మీదే ఉండడంతో ఓపిక లేకపోయినా అప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వచ్చిందని మెడిసిన్ లో ఉండడం వల్ల స్ట్రెంత్ లేదని వీక్ గా ఉన్నానని అయితే అలా తన కాన్ఫిడెంట్ కోల్పోకుండా పోరాడుతూ వచ్చిన సమంత ఇప్పుడు తానే స్వయంగా ఫర్ఫెక్ట్ ఆల్ రైట్ అంటూ చెప్పడం నిజంగా పెద్ద విశేషం అని చెప్పవచ్చు దీంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.