ఆ బ్లాక్‌బస్టర్ హిట్టుపై రమ్యకృష్ణ సెన్సేషనల్ కామెంట్స్..

ఒకప్పటి నటి రమ్యకృష్ణ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఎన్నో సినిమాలలో నటించి అభిమానుల మనసు గెలుచుకుంది. తన అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతుంది. బాహుబలి సినిమాలో రాజమాతగా ప్రేక్షకులను అలరించింది. ఆ తరువాత బంగారాజు, లైగర్ లాంటి సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం రంగమార్తండా అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్బంగా రమ్యకృష్ణ ఒక యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ ‘రంగమార్తండా’ సినిమాకి సంబంధించిన విషయాల గురించి చెప్పారు. రంగమార్తండా సినిమా మొదలు పెట్టకముందు, అసలు ఈ సినిమాని ఎవరు చూస్తారు? అని ఆమె భర్త కృష్ణ వంశీని అడిగిందట రమ్యకృష్ణ. ఆమె మాతృక చిత్రం ‘నటసామ్రాట్ ‘ సినిమాని మరాఠిలో చూశారట. అప్పుడు సినీ ప్రేక్షకులకు ఎక్కువగా ఇలాంటి సీరియస్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అని ఆమెకి అనిపించి భర్తకి చెప్పిందట.

కానీ కృష్ణ వంశీ ఆమె మాటలు పట్టించుకోకుండా ‘రంగమార్తండా’ సినిమాని మొదలు పెట్టారు. అయితే అందులో ఒక పాత్ర కోసం ఎంతో మంది హీరోయిన్లను సంప్రదించారు. కానీ ఎవ్వరు ఆ పాత్రకి సరిపోలేదు. అప్పుడు రమ్యకృష్ణ ఆ పాత్రలో తను నటిస్తానని తన భర్తకి చెప్పిందట. ఆ పాత్ర కేవలం కళ్ళతోనే నటించాల్సి ఉంటుందని కృష్ణ వంశీ చెప్పారట. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణతో పాటుగా ప్రకాశ్‌రాజ్‌, బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌ తదితరులు నటించారు. రంగమార్తండా సినిమా ఉగాది పండుగ సందర్భంగా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా చూస్తుంటే కచ్చితంగా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని ప్రేక్షకులు అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు.