అంతర్జాతీయ వేదికగా డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన RRR చిత్రం ఎంతటి సత్తా చాటిందో చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ దేశాలు సినీ ప్రియులను మెప్పిస్తూ విశ్వవేదికపై ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయాస్, హాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ఛాయిస్ అవార్డులు మాత్రమే కాకుండా సినీ పరిశ్రమలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా అందుకోవాలని అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్నది.
ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అకాడమీ అవార్డు అందుకున్నది. ఇటీవల లాస్ ఏంజెల్స్ వేదికగా జరిగిన 95 వ ఆస్కార్ అవార్డు వేరుకలు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి రచయిత చంద్రబోస్ ఈ అవార్డును అందుకోవడం జరిగింది. దీంతో ఇప్పుడు RRR సినిమా సీక్వెల్ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో లాగానే ఈ సీక్వెల్ పైన స్పందించిన రాజమౌళి పలు ఆసక్తికరమైన కామెంట్లు చేయడం జరిగింది. తాజాగా ఒక మ్యాగజైన్ కు ఇంటర్వ్యూ లో రాజమౌళి ఆస్కార్ అవార్డు తనను మరింత ఉత్సాహానికి గురి చేసింది ..ఆస్కార్ అవార్డు రావడంతో ఇప్పుడు RRR సీక్వెల్ మరింత వేగంగా ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలియజేశారు.
ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. సీక్వెల్ చేయాలనుకున్నాము అప్పుడు మాకు కొన్ని ఆలోచనలు అయితే తట్టాయి..కానీ అంత స్పష్టంగా అనుకోలేదు. విదేశాలలో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించడంతో..నేను మా నాన్న.. మా కజిన్ కీరవాణితో మరొకసారి చర్చించినప్పుడు నాకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది.ఆ వెంటనే ఒక స్క్రిప్ట్ను కూడా రాయించడం మొదలుపెట్టాను స్క్రిప్ట్ పూర్తి అయ్యేవరకు ఈ సినిమాను ముందుకు తీసుకువెళ్లలేము అంటూ తెలిపారు.