`కార్తికేయ 2` మూవీతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ కు తాజాగా బాలీవుడ్ నుంచి ఓ అరుదైన గౌరవం దక్కింది. కార్తికేయ 2 సౌత్ లోనే కాదు నార్త్ లోనూ ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీతో నిఖిల్ కు బాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ దక్కించింది.
తాజాగా ఈ సినిమాకి నిఖిల్ నార్త్ లో అవార్డ్ కూడా అందుకున్నాడు. బాలీవుడ్ లో ప్రతి ఏడాది ఇచ్చే ప్రముఖ ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ వేడుక ఇటీవల ముంబైలో అట్టహాసంగా జరిగింది. అయితే 2022 గాను కార్తికేయ2 సినిమాకి పాపులర్ ఛాయస్ కేటగిరీలో బెస్ట్ యాక్టర్ గా నిఖిల్ అవార్డు అందుకున్నాడు.
ఈ అరుదైన గౌరవం ఇంతకు ముందు ఏ తెలుగు హీరోకు దక్కలేదు. టాలీవుడ్ నుంచి ఐకానిక్ గోల్డ్ అవార్డ్ అందుకున్న తొలి హీరోగా నిఖిల్ రికార్డు సృష్టించాడు. దీంతో నిఖిల్ ను ఆకాశానికి ఎత్తేస్తూ బాలీవుడ్ మీడియా ప్రశంసలు కురిపిస్తోంది. కాగా, నిఖిల్ ప్రస్తుతం `స్పై` అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ లో బిజీగా ఉన్నారు మేకర్స్. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.