నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న మృణాల్ ఠాకూర్..!!

బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ అక్కడ పరవాలేదు అనిపించుకున్న కొంతమంది హీరోయిన్స్ తెలుగులో నటించి సూపర్ క్రేజీ తెచ్చుకున్న వారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. ఇప్పుడు తనకు వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకొనేందుకు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఆమెతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు అందుచేతనే తన రెమ్యూనరేషన్తో అందరికీ షాక్ ఇస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

సీతారామం సినిమాకి కోటి రూపాయల కంటే తక్కువగా రెమ్యూనరేషన్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇక మీదట తన నటించబోయే సినిమాలకు రూ .3 కోట్ల రూపాయలు పారితోషకం ఇస్తేనే నటిస్తానని తెగేసి చెప్పేస్తోందట. అయితే ఈమె చేస్తున్నవి అన్ని పాన్ ఇండియా సినిమాలు అయినప్పుడు అంత రెమ్యూనరేషన్ ఇస్తే తప్పు లేదంటు అభిమానులు తెలియజేస్తున్నారు. సీతారామం చిత్రం వల్లే ఈమెకు ఇంత క్రేజ్ ఏర్పడిందని చెప్పవచ్చు. బాలీవుడ్ లో నటించిన సినిమాలు పెద్దగా కలిసి రాలేదు.

ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ నానితో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే కాకుండా బాలీవుడ్ లో కూడా వాళ్ళ చిత్రాలలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా తన అంత చెందాలతో ఆకట్టుకుంటూ కుర్రకారులకు షాక్ ఇస్తూ ఉంటుంది. గ్లామర్ విందు చేయడంలో కూడా ఏమాత్రం వెనుకడుగు వేయదు మృణాల్ ఠాకూర్.