ఎన్టీఆర్ బాలీవుడ్ లో సినిమా చేయబోతున్నారా..?

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట ఎన్నో విమర్శల నుంచి ఎదుర్కొని ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు ఎన్టీఆర్. RRR సినిమా తెచ్చి పెట్టిన క్రేజ్ మామూలుగా లేదు. ఎన్టీఆర్ క్రేజ్ డభుల్ అయిందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ గురించి అభిమానులే కాకుండా సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూసిన తర్వాత ఈయన నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ టి సిరీస్ ఓనర్ భూషణ్ కుమార్ తో చాలా క్లోజ్ గా ఉంటున్నారు. తరచుగా ఆయనను కలుస్తూ ఉండడంతో ఏదో పాన్ ఇండియా సినిమానే ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
Bhushan Kumar in Talks to Collaborate with Jr. NTR: All Details Here -  HashtagU
అంతేకాకుండా రీసెంట్ గా ఎన్టీఆర్ -30 వ సినిమా ముహూర్త కార్యక్రమానికి కూడా ఈయన వెళ్లడం జరిగింది. దీంతో బాలీవుడ్లో ఎవరూ ఊరికే వెళ్లారు కదా అంటూ పలు రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. డెఫినెట్గా టీ సీరిస్ ప్రొడ్యూసర్ తో టాలీవుడ్ బాద్షా బిగ్ ప్రాజెక్టు చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ విషయాన్ని ఎన్టీఆర్ అభిమానులు ట్యాగ్ చేసి మరి నెట్టెంత వైరల్ అయ్యేలా చేస్తున్నారు.
ఎన్టీఆర్ 30వ సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతోంది ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నది. ఈ చిత్రం హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫ్రీ లుక్స్ పోస్టర్.. జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి దీంతో త్వరలోనే ఈ సినిమా నుంచి అప్డేట్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈసారి కొరటాల శివ సక్సెస్ అందుకునేందుకు ధీమాని వ్యక్తం చేస్తున్నారు.