భర్త వల్ల రూ.కోట్లు కోల్పోయిన హీరోయిన్ రోజా.. ఇప్పటికీ అదే నిరాశలో!!

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్స్ హీరోయిన్స్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. వారిలో మణిరత్నం – సుహాసిని, అమల – విజయ్, రోజా – సెల్వన్, నయనతార – విగ్నేష్ శివన్ లాంటి కపుల్స్ చాలా మంది ఉన్నారు. అయితే వీరందరిలో రోజా – సెల్వన్ల లవ్‌స్టోరీ చాలా డిఫరెంట్. వీరు 1992లో ప్రేమించుకొని 2002లో పెళ్లి చేసుకున్నారు. అంటే దాదాపు 10 ఏళ్లు ప్రేమలో ఉన్నారు.

మొదట్లో సెల్వన్ రోజాని ప్రేమించానని చెప్పడానికి భయపడే వాడట. దాంతో రోజా కుటుంబ సభ్యులని సంప్రదించి అతని ప్రేమ గురించి చెప్పగానే వారు ఓకే అనే చెప్పారట. ఆ తరువాత రోజాకి విషయం చెప్పి ఆమె ప్రేమను కూడా పొంది పెళ్లి చేసుకుంటాడు. సెల్వన్ తో పెళ్లి తరువాత రోజా ఒకవైపు తెలుగు ప్రేక్షకులకు, మరోవైపు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తరువాత కొంతకాలనికి రోజాకి హీరోయిన్‌గా అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నటించింది. సినిమాలోనే కాకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రస్తుతం వైసీపీ పార్టీలో టూరిస్ట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుంది. దాంతో సినిమాలకు దూరం అయింది. అయితే ఒకప్పుడు ఆమె భర్త సెల్వన్ కారణంగా రోజా కోట్ల రూపాయలు నష్టపోయిందట.

రోజా, సుమన్, రఘువరన్ ప్రధాన పాత్రలలో నటించిన సమరం సినిమాకి సెల్వమణి దర్శకత్వం వహించారు. భర్త డైరెక్షన్ లో వచ్చిన సినిమాపై నమ్మకం తో రోజా ఆ సినిమాని ప్రొడ్యూస్ కూడా చేసింది. సమరం సినిమాపై అందరూ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. 1994లో విడుదలైన ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. భర్తపై నమ్మకంతో సమరం సినిమా కోసం కోట్ల రూపాయలు ఖర్చుచేసిన రోజా చివరికి నష్టపోయింది. ఆ సమయంలో ఆర్థికంగా చాలా నష్టపోయింది రోజా.