కూతురికి మెగాస్టార్ ఇచ్చిన గిఫ్ట్.. దాని ధర తెలిస్తే అవాక్కవుతారు..

చిరంజీవి పెద్ద కూతురు ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా బిజీ అయిపోయింది. సుస్మిత ఒకవైపు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తూనే, ఇంకోవైపు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తుంది. ఇటీవల ఆమె సొంత ప్రొడక్షన్‌లో రిలీజైన ‘శ్రీదేవి శోభన్ బాబు’ సినిమా మిశ్రమ స్పందన అందుకుంది. ఇక సుస్మిత మెగాస్టార్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తుందనే విషయం మనందరికి తెలిసిందే. తాజాగా చిరు నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా లో ఆయన మాస్ లుక్ ని సుస్మిత ఎంతో అద్భుతంగా చూపించారు.

ఇదిలా ఉండగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడంతో మెగాస్టార్ చిరంజీవి తన కూతురు సుస్మితకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ గిఫ్ట్‌కి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా అబిమానులకు షేర్ చేస్తూ తన తండ్రికి థాంక్స్ చెప్పింది. ఇక ఆ గిఫ్ట్ విషయానికి వస్తే చిరంజీవి, సుస్మితకు బంగారం వెండితో తయారు చేసినటువంటి అమ్మవారి విగ్రహాన్ని కానుకగా ఇచ్చారు. తండ్రి ఇచ్చిన గిఫ్ట్ అందుకుని దిగిన ఫోటోని సుస్మిత సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘నాకు ఇలాంటి బహుమతి ఇచ్చినందుకు థాంక్యూ నాన్న. మహిళను దుర్గాదేవి కంటే శక్తివంతంగా ఇంకెవరు చూపగలరు’ అనే క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక మెగాస్టార్ సినిమాల విషయానికి వస్తే ఈయన వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ‘భోళాశంకర్’ సినిమాలో చిరంజీవి నటిస్తున్నారు. ఈ సినిమా చిరంజీవి సరసన తమన్నా నటిస్తుండగా, చిరంజీవికి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఈ సినిమా కి సంబందించిన షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతుంది.