ట్రైలర్: ఈసారైనా కిరణ్ అబ్బవరం సక్సెస్ అయ్యేనా..?

మొదట రాజా వారు రాణివారు సినిమాతో పరిచయమయ్యారు నటుడు కిరణ్ అభవనం. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం, సమ్మతమే వంటి చిత్రాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా జిఏ 2 బ్యానర్ లో వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 17న శివరాత్రి స్పెషల్ గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ను ప్రారంభించింది చిత్రం బృందం. ఇప్పటికే ఈ సినిమా నుంచి యాక్షన్ డ్రామాకు సంబంధించి విడుదలైన పాటలు, టీజర్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.

Wakeup Kiran Abbavaram

తాజాగా ఈ చిత్రం మేకర్ ట్రైలర్ను విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ ని హీరో సాయి ధరంతేజ్ రిలీజ్ చేసి.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ట్రైలర్ మొత్తం చాలా ఇంట్రెస్ట గా సాగిపోయేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ఫోన్ నెంబర్ సైబర్ అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా స్టోర్ ని డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది డైరెక్టర్. మన మొబైల్ నెంబర్ లో లాస్ట్ డిజిట్ కి అటుపక్క ఒక నెంబర్ ఇటుపక్క ఒక నెంబర్ ఉంటుంది కదా అలా హీరోయిన్ తన నెంబర్ కి ఉన్న సైబర్ నెంబర్ ని కాంటాక్ట్ అవుతుంది.ఇందులో ఒక నెంబర్ హీరో కిరణ్ అబ్బవరంది మరొక నెంబర్ మురళి శర్మాది ఈ ముగ్గురు మధ్య జరిగే ప్రేమ సన్నివేశాలు ఆడియన్స్ ని అలరించేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక హీరోయిన్ లాగానే హీరో నెంబర్ కి కూడా సైబర్ నెంబర్ ఉంటాయి కదా వాటిలో ఒకటి హీరోయిన్ అయితే మరొక నెంబర్ విలన్ ది ఇలా సైబర్ నెంబర్ ని కాంటాక్ట్ అవ్వడం వల్ల హీరో హీరోయిన్స్ అనుకోకుండా ప్రమాదంలో పడతారు. ఇక ఆ తర్వాత వీరు ఎలా బయటపడ్డారు అన్నది ఈ సినిమా కథ. మరి ఈ చిత్రంతోనైనా ఈసారి కిరణ్ అబ్బవరం సక్సెస్ అవుతారేమో చూడాలి మరి.