ముంబైలో గ్రాండ్ గా కియారా-సిద్ధార్థ్ వెడ్డింగ్ రిసెప్షన్.. ఫోటోలు వైర‌ల్‌!

బాలీవుడ్ ప్రేమ ప‌క్షులు సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అద్వానీ ఇటీవ‌ల పెళ్లి బంధంతో ఒక‌టైన సంగ‌తి తెలిసిందే. `షేర్షా` మూవీతో ఏర్ప‌డ్డ వీరి ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌గా.. పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి వ‌ర‌కు త‌మ బంధాన్ని తీసుకెళ్లారు.

ఫిబ్ర‌వ‌రి 7వ తేదీన రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని సూర్యగఢ్‌ ప్యాలెస్‌లో కుటుంబ‌స‌భ్యులు, సన్నిహితుల సమక్షంలో కియారా-సిద్ధార్థ్ అంగ‌రంగ వైభ‌వంగా వివాహం చేసుకున్నారు.

ఇప్ప‌టికే వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే ఫిబ్ర‌వ‌రి 12న కియారా-సిద్ధార్థ్ వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా జ‌రిగింది. ముంబైలో జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్ అతిరథ మహారథులు విచ్చేశారు.

కరీనా కపూర్, వివెక్ ఓబెరాయ్, ఇషాన్ కట్టర్, అనన్యా పాండే, మనీష్ మల్హోత్రా, విద్యాబాలన్, అజయ్ దేవగణ్, కాజోల్, అనుపమ్ ఖేర్ తదితరులు ఈ జాబితాలో ఉన్నాయి.

ముంబైలోని ఓ స్టార్ హోటల్ లో కియారా-సిద్ధార్థ్ వెడ్డింగ్ రిసెప్షన్ అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.