షాకింగ్ న్యూస్‌.. సమంత `శాకుంత‌లం` మ‌రోసారి వాయిదా!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, మలయాళ నటుడు దేవ్‌ మోహన్ జంటగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అద్భుతమైన దృశ్య కావ్యం `శాకుంతలం`. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని దాదాపు అర‌వై కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించారు. ఇందులో మోహన్ బాబు, ప్ర‌కాశ్ రాజ్‌, అదితి బాలన్, అల్లు అర్హ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

ఈ భారీ విజువల్ వండర్ ను ఫిబ్రవరి 17న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయాల‌ని భావించారు. కానీ, తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. గ‌త ఏడాది విడుద‌ల కావాల్సిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రికి పోస్ట్ పోన్ చేశారు. అయితే శాకుంత‌లం మ‌రోసారి వాయిదా ప‌డబోతోందట‌.

విడుద‌ల‌కు కేవలం పదహారు రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ప్యాన్ ఇండియా లెవెల్ లో ప్రమోట్ చేయాలి అంటే హైదరాబాద్ లో ఒకటే ఈవెంట్లు ఇంటర్వ్యూలు చేస్తే సరిపోదు. చెన్నై బెంగళూరు ముంబై అంటూ పలుచోట్ల తిరిగి సినిమాను ప్రేక్ష‌కుల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలా చేయ‌కుండా క‌లెక్ష‌న్స్ పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంది. అయితే ఇంత త‌క్కువ టైమ్ లో అంత భారీగా ప్ర‌మోష‌న్స్ ను నిర్వ‌హించ‌డం కూద‌రని ప‌ని. ఈ నేప‌థ్యంలోనే విడుద‌ల‌ను మార్చి లేదా ఏప్రిల్ కు పోస్ట్ పోన్ చేయాల‌ని భావిస్తున్న‌ట్లు నెట్టింట ప్ర‌చారం జ‌రుగుతోంది.