ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొద‌టి భార్య ఏం చేస్తుంది.. ఇప్పుడు ఎక్క‌డ ఉందో తెలుసా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ప్ర‌స్త‌వాన వ‌చ్చిందంటే.. ఖ‌చ్చితంగా ఆయ‌న మూడు పెళ్లిళ్ల విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తుంది. ముఖ్యంగా రాజకీయాల్లో మూడు పెళ్లిళ్ల విష‌యాన్ని సాకుగా చూపిస్తూ పవన్ ను తరచూ విమర్శిస్తూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ కు ముగ్గురు భార్యలు అనే విషయం అందరికీ తెలిసిందే. సినిమాల్లోకి రాకముందే 1997లో విశాఖపట్నం కు చెందిన నందిని అనే అమ్మాయిని ప‌వ‌న్ వివాహం చేసుకున్నారు.

వీరిది పెద్ద‌ల కుదిర్చిన వివాహం. చిరంజీవి దాదాపు రూ. 10 లక్షలు ఖర్చు పెట్టింట అంగ‌రంగ వైభవంగా వీరి పెళ్లిని జరిపించారు. అయితే ప‌వ‌న్, నంద‌ని బంధం ఎక్కువ కాలం కొన‌సాగ‌లేదు. పెళ్లైన కొద్ది సంవ‌త్స‌రాల‌కే వీరి విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత బద్రి సినిమాతో రేణు దేశాయ్ ను ప్రేమించి, పెళ్లి చేసుకోవ‌డం, ఆమెతో ఇద్ద‌రు పిల్ల‌ల‌ను క‌న‌డం, ఆపై విడిపోవ‌డం అంద‌రికీ తెలుసు.

రేణు దేశాయ్ తో విడాకుల అనంత‌రం ప‌వ‌న్ రష్యాకు చెందిన అన్నా లెజ్నెవాను వివాహం చేసుకున్నారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొద‌టి భార్య నంద‌ని ఏం చేస్తుంది.. ఇప్పుడు ఎక్క‌డ ఉంది.. అన్న విష‌యాలు చాలా మందికి తెలియ‌దు. ప‌వ‌న్ నుంచి నంద‌ని 2007లో విడాల‌కు తీసుకుంది. ఆ త‌ర్వాత ఆమె త‌న పేరును జాహ్నవిగా మార్చుకుంది. 2010లో డాక్టర్ కృష్ణ రెడ్డిని జాహ్నవి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం భార్త తో కలిసి నందిని అమెరికాలో ఉంటున్నట్లు సమాచారం.