బాలీవుడ్ ప్రేమ పక్షులు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా రీసెంట్ గా పెళ్లి బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్ల నుంచి పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట.. ఫైనల్గా ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్లోని సూర్యఘడ్ కోటలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.
వీరి పెళ్లిలో కరణ్ జోహార్, మనీష్, షాహిద్ కపూర్, మీరా రాజ్పుత్, జూహీ చావ్లా, రామ్ చరణ్ మరికొందరు సెలబ్రిటీలు సందడి చేశారు. ఇప్పటికే సిద్ధార్థ్, కియారా పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పుడు పెళ్లిలో కియారా ధరించిన డ్రెస్ ధర అందరికీ దిమ్మ తిరిగిపోయాలా చేస్తోంది. పెళ్లి వేడుకలో కియారా అద్వానీ లేత గులాబీ వర్ణం లెహంగాలో తళతళ మెరిసిపోతూ ఎంతో అందంగా కనిపించింది. అలాగే సిద్ధార్థ్ బంగారు వర్ణంలోని షార్వానీ ధరించారు.
వీరిద్దరి దుస్తులను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. ముఖ్యంగా కియారా లెహంగా అందరినీ అట్రాక్ట్ చేసింది. బంగారం మరియు వెండి పూత తో చేయించిన ఈ లెహంగా విలువ సుమారుగా రూ. 50 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ దుస్తులను కేవలం వివాహ మోహోత్సవం కోసమే ప్రత్యేకంగా ఎన్నో రోజులు శ్రమించి చేయించారట. ఏదేమైనా ఒక డ్రెస్ కే 50 లక్షలు ఖర్చు పెట్టారంటే ఇక పెళ్లికి సంబంధించిన మొత్తం ఖర్చు ఎన్ని కోట్లు అయ్యాయో అర్థం చేసుకోవచ్చు.