సాయి ప‌ల్ల‌వి-శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా?

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఫిదా సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ అందాల భామ.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హోదాను అందుకుంది. అందాల ఆరబోతకు ఆమడ దూరంలో ఉంటూ తన సహజ నటనతోనే భారీ ఫాలోయింగ్ ను పెంచుకుంది.

శ్రీ‌లీల‌ విషయానికి వస్తే ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ సెన్సేషన్ ఈమె. తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు పొందిన శ్రీ‌లీల ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. ఇక‌పోతే సాయి పల్లవి, శ్రీలీల కు మధ్య కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. అందులో మొదటిది ఇద్దరూ డాక్టర్స్. జార్జియా దేశంలో సాయి పల్లవి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆపై నటిగా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు.

శ్రీలీల సైతం డాక్టర్. ఆమె బెంగుళూరులో ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ చ‌దువుతోంది. త్వరలో ఆమె తన డిగ్రీ పూర్తి చేయబోతోంది. సాయి ప‌ల్ల‌వి, శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న మరో కామన్ పాయింట్ ఇద్దరూ అద్భుత‌మైన డాన్సర్స్. సాయి పల్లవి త‌న‌కు తానే సొంతంగా డ్యాన్స్ నేర్చుకుంది. శ్రీలీల భరత నాట్యం నేర్చుకుంది. ఇక వెండితెర‌పై సాయి ప‌ల్ల‌వి, శ్రీ‌లీల గ్రేస్ ఫుల్ స్టెప్స్ కు ఫిదా కానివారుండ‌రు.