నిర్మాతలకు లాభాలు తెచ్చి పెడుతున్న.. సుహస్..!!

టాలీవుడ్ కమెడియన్ హీరో సుహాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం రైటర్ పద్మభూషణ్. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా విడుదలైనప్పటినుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెడుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ చిత్రం యు.ఎస్ లో కూడా సాలిడ్ కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. కొత్త డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించారు.

Writer Padmabhushan Review
అయితే ఈ సినిమా బడ్జెట్ రూ .4 కోట్ల రూపాయలు మాత్రమే అన్నట్లుగా తెలుస్తోంది. మొదటి వారంతోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ .5కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఓవర్సీస్ లో కూడా $200k వసూలు చేసినట్లు సమాచారం. బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ టైం ముగిసే సరికి నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చే విధంగా ఉంటుందని సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఆకట్టుకునే కథనాలతో ఫ్యామిలీ యాక్షన్ ఎలిమెంట్ను ఎంటర్టైన్మెంట్గా చూపించిన ఈ చిత్రం అన్ని ప్రాంతాల ఆడియన్స్ను బాగా అలరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులను జి నెట్వర్క్ ఫ్రీ రిలీజ్ ధరకు దక్కించుకుంది. ఇక ఇప్పటికే నిర్మాతలను లాభాల్లోకి తీసుకువచ్చింది. ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో మరింత దూసుకుపోతోంది. రైటర్ పద్మభూషణ్ సినిమాను ఇతర భాషలలో రీమిక్స్ కోసం మంచి ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సుహాస్ కు జోడిగా టీనా శిల్ప రాజ్ హీరోయిన్గా నటించింది. రోహిణి ఆశిష్ విద్యార్థి గోపరాజు రమణ వంటి వారి కీలకమైన పాత్రలు నటించారు.