తారకరత్న కోలుకునేందుకు బాలయ్య మరొక సంచల నిర్ణయం..!!

గత కొద్దిరోజులుగా నటుడు నందమూరి తారకరత్న గుండెపోటుతో బెంగళూరు హృదయాలయ హాస్పిటల్ చికిత్స పొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే.. తారకరత్న త్వరగా కోలుకునేందుకు విదేశాల నుంచి వైద్యులను తెప్పిస్తున్నారు కుటుంబ సభ్యులు. కాగ తారకరత్న ఆరోగ్య విషయంలో హీరో నందమూరి బాలకృష్ణ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కేవలం అస్వస్థకు గురైనప్పటి నుంచి కుప్పం ఆసుపత్రిలో చేర్పించి ఆ తర్వాత బెంగళూరు హృదయాలయ ఆసుపత్రికి తరలించే వరకు తారకరత్న ను దగ్గరుండి చూసుకుంటున్నారు బాలయ్య. ఇక అబ్బాయి వైద్యం కోసం అవసరమైన ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తూ ఉన్నారు.

Balakrishna: తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బాలకృష్ణ క్లారిటీ.. బెంగుళూరు  తరలిస్తున్నారు... | Taraka Ratna Health Update: Balakrishna Gives Clarity  on tarakaratna health telugu cinema news ...
ఇక తారకరత్న ఆరోగ్యం మెరుగవ్వాలంటూ అఖండ దీపానికి కూడా శ్రీకారం చుట్టారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో భక్తలాపురంలో మృత్యాంజనేయ స్వామి ఆలయంలో సుమారు 44 రోజులపాటు ఈ అఖండ జ్యోతి వెలిగేల చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా అబ్బాయి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న బాలయ్య ఈసారి మరొక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది బాలయ్య.. ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది ఈ చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో బాలకృష్ణ తన 108వ చిత్రాన్ని ప్రారంభించారు.

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఒక షెడ్యూల్ ఇటీవలే పూర్తి అయ్యింది. ఇక సెకండ్ షెడ్యూల్ ఈ నెలలో ఉండగా..ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి అన్ని విషయాలు దగ్గరుండి చూసుకుంటున్న బాలయ్య షూటింగ్ హాజరు కాలేరని చిత్ర యూనిట్ కి చెప్పేశారట.. దీంతో తన సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ వాయిదా వేయమని కోరినట్లు తెలుస్తోంది తారకరత్న ఆసుపత్రిలో ఉండగా తన మానసిక పరిస్థితి ఏమి బాగలేదని.. ఇలాంటి సమయంలో షూటింగ్ కి హాజరు కాలేను అని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.