చిత్ర పరిశ్రమ అంటేనే రంగుల ప్రపంచం.. ఇక్కడ రాణించాలంటే హీరోయిన్లు తమ అందాలను ఆరబోయాల్సిందే, లేకపోతే వారిని ఎవరు ఒక చూపు కూడా చూడరు.. ఇప్పుడు సినిమా పరిశ్రమలో ఉన్న చాలా మంది హీరోయిన్ల విషయంలో ఇదే జరుగుతూ వస్తుంది. హోమ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కూడా తన కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తుంది. ఇక ఆమె మొదట్లో సెకండ్ హీరోయిన్ గా కూడా కొన్ని సినిమాల్లో నటించింది.
ఆ తర్వాత తక్కువ సమయంలోనే హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువతలో అనుపమకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఆమె క్యూట్ స్మైల్ కు, అందానికి పడి చచ్చిపోయే ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ఆమెకు చాలాకాలం అవకాశాలు లేక ఖాళీగానే ఉంది. ఆ సమాయంలోనే దిల్ రాజు, మేనల్లుడు శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా వచ్చిన రౌడీ బాయ్స్ సినిమాలో అనుపమ హీరోయిన్గా నటించింది.
ఈ సినిమాలో ఆమె తన పాత సినిమాలుకు భిన్నంగా ఎంతో గ్లామర్ గా మార్చేశారు. ఇప్పుడు ఉన్నా ఈ గ్లామర్ ప్రపంచంలో లిప్ లాక్ లు, ఎక్స్పోజింగ్ చేస్తేనే మంచి సినిమాలు వస్తాయని ఆమెకు నచ్చజెప్పారు. అనుపమ కూడా అంత పెద్ద ప్రొడ్యూసర్ చెప్పే సరికి తన మనసును మార్చుకొని.. ఈ సినిమాలో ఏకంగా లిప్ లాక్ లు కూడా ఇచ్చి పడేసింది.
ఇక అప్పటినుంచి ఏ సినిమాలో అయినా ఎలాంటి పని చేయడానికి అయినా రెడీ అని చెప్పకనే చెప్పేసింది. పైగా రీసెంట్ గానే హాట్ అందాలను ఆరబోసి కుర్రాళ్ల మతులు చెడగొడుతుంది. ఇలా మొత్తానికి దిల్ రాజు అనుపమను మార్చేశాడన్నమాట.