బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా నేడు పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ జైసల్మేర్లోని సూర్యగఢ్ హోటల్లో సిద్ధార్థ్ మరియు కియారాల వివాహ కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. హల్దీ, మెహందీ, సంగీత్ వంటి కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి అయ్యాడు.
నేడు కుటుంబ సభ్యులు, బంధువులు మరియు పులువురు సినీ ప్రముఖుల నడుమ కియారా, సిద్ధార్థ్ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. వీరి పెళ్లి ఫోటోల కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే కియారా-సిద్దార్థ్ వెడ్డింగ్ మెనూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వీరి వివాహ వేడుకలో 10 దేశాల నుండి మొత్తం 100 రకాల వంటకాలు వడ్డించబోతున్నారట.
మెనూలో ఇటాలియన్, అమెరికన్, చైనీస్, మెక్సికన్, సౌత్ ఇండియన్, రాజస్థానీ, గుజరాతీ, పంజాబీ వంటకాలు ఉన్నాయి. అంతేకాదు.. జైసల్మేర్ ప్రసిద్ధ ఘోత్వాన్ లడ్డూలకు ఫేమస్. ఈ వంటకం కూడా మెనూలో భాగమైందట. అలాగే వివాహ వేదిక వరకు అతిథులు రావడానికి 70 లగ్జరీ కార్లను ఏర్పాటు చేసిందీ జంట. విక్కీ- కత్రినాల పెళ్లిలో మాదిరిగానే ‘నో ఫోన్ పాలసీ’ని వీరి పెండ్లిలోనూ అమలు చేస్తున్నారు. కాగా, కియారా, సిద్ధార్థ్ నిశ్చితార్థం ఫిబ్రవరి 12న ముంబైలో గ్రాండ్ గా జరగబోతోందని సమాచారం.