టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఏ సినిమా కూడా సక్సెస్ ని అందుకోలేకపోయింది పూజ హెగ్డే. ఈ ముద్దుగుమ్మ ముంబై బ్యూటీ కానీ ఆమె తల్లిదండ్రులు కర్ణాటక ప్రాంతానికి చెందిన వాళ్లు. ఈమె మొట్టమొదటిగా తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అక్కడ జీవ హీరోగా నటించిన మాస్క్ మూవీలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ‘ఒక లైలా కోసం’ అనే చిత్రంలో నటించింది. ఆ సినిమా బాగానే ఆడింది కానీ పూజకు పెద్దగా పేరు తెచ్చి పెట్టలేదు.
ఇక పూజ హెగ్డే ఒకవైపు బాలీవుడ్ లోనూ మరోవైపు టాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది. కానీ ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ ని తెచ్చి పెట్టలేదు.ఆమెకి బాలీవుడ్ లో కాస్త గ్యాప్ తీసుకున్న ఇమే సర్కస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల రిలీజ్ అయ్యి ఫ్లాప్ ను మూట కట్టుకుంది. ఈ సినిమాకి 150 కోట్ల బడ్జెట్ పెడితే అందుకుగాను 30 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
దీంతో డైరెక్టర్ రోహిత్ శెట్టి పై పూజ హెగ్డే కి ఉన్న నమ్మకం వృధా అయిపోయిందని చెప్పవచ్చు.. ఈ దెబ్బకు బాలీవుడ్లో కోలుకోవటం కష్టంగానే అనిపిస్తోంది. పూజా హెగ్డే టాలీవుడ్ లో బాలీవుడ్ లో దర్శకనిర్మాతలు ఈమెకి సినిమా ఇయాలంటేనే భయపడుతున్నారు. ఈమెతో ఏ సినిమా చేసినా ఫ్లాపులే అవుతున్నాయి. ముఖ్యంగా ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోతుంది. మరి పూజ హెగ్డే కి ఈ ఏడాదైనా సరైన సక్సెస్ లు వరించి సక్సెస్ బాటపడుతుందేమో చూడాలి మరి. ప్రస్తుతం పూజ హెగ్డే కి సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.