టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సమంత కాంబినేషన్ లో `ఖుషి` అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం 40 శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది.
అయితే అంతలోనే సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురికావడంతో.. ఆమె ఇంటికి పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో ఖుషి షూటింగ్ కు బ్రేక్ పడింది. సమంత పరిస్థితిని అర్థం చేసుకుని విజయ్ సైతం ఖుషి షూటింగ్ విషయంలో గత కొద్ది నెలల నుంచి సైలెంట్ గానే ఉన్నాడు. కానీ ఇప్పుడు సమంత మయోసైటిస్ నుంచి కాస్త కోలుకుంది. ఇటీవల శాకుంతలం ప్రమోషనల్ ఈవెంట్ లోనూ పాల్గొంది. ఇక ఖుషి షూటింగ్ లో పాల్గొనేందుకు సమంత ఇంకొంత సమయం అడిగిందట.
అయితే ఈ లోపే విజయ్ బిగ్ షాక్ ఇచ్చాడట. ఖుషి సినిమా త్వరగా రీస్టార్ట్ చేయకుంటే తాను గౌతమ్ తిన్ననూరి మూవీని సెట్స్ మీదకు తీసుకువెళ్తానని మైత్రీ వారితో చెప్పేశాడట. ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చింది.. ఇక తాను వెయిట్ చేయలేనని అనేశాడట. ఇక విజయ్ దేవరకొండ ఒత్తిడితో మైత్రీ నిర్మాతలు సమంతను ఫిబ్రవరి నుండి షూటింగ్ కి రప్పించే పనిలో పడ్డారని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది.