టాలీవుడ్‌లో వరలక్ష్మి శరత్‌ కుమార్ టైం మామూలుగా లేదు… దాంతో భారీగా డిమాండ్!

కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్ కొన్నేళ్లుగా తెలుగులో నటిస్తూ చాలామందిని మెప్పిస్తుంది. ఈ ముద్దుగుమ్మ మొదటగా తమిళంలో హీరోయిన్‌గా సినిమాల్లో నటించింది. అందరి హీరోయిన్ల వలె గ్లామర్ రోల్స్ అంత ఎక్కువగా చేయకుండా ప్రాధాన్యమున్న పాత్రలోనే ఈ ముద్దుగుమ్మ నటించింది. అంతేకాకుండా, లేడీ విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించే మెప్పించింది. ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్ సినిమాలను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అందుకే ఆమె నటించిన అన్ని సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి.

వరలక్ష్మి హీరోయిన్ గా కంటే విలన్ గానే బాగా సెట్ అవుతుందని చెప్పొచ్చు. ఆమె ఫిజిక్, వాయిస్, హావభావాలు అన్నీ కూడా చాలా వయోలెంట్‌గా ఉంటాయి. అందుకనే ఆమె నెగిటివ్ పాత్రల్లో నేచురల్‌గా ఒదిగిపోతుంటుంది. ఇక ఈ సంక్రాంతికి వరలక్ష్మి బాలకృష్ణ తో కలిసి వీర సింహా రెడ్డి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించింది. ఈ స్టార్ యాక్ట్రెస్ లేడి విలన్, బాలకృష్ణ సోదరి పాత్రలో బాగా నటించిందని ఇప్పుడు ఆమెకు ప్రశంసలు అందుతున్నాయి.

బాలకృష్ణ, వరలక్ష్మి కాంబోలో వచ్చిన సెంటిమెంట్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలాలు కావడంతో వరలక్ష్మికి మళ్లీ మంచి గుర్తింపు లభించింది. దీంతో ఆమెకు టాలీవుడ్‌లో మరింత డిమాండ్ ఏర్పడుతుందని చెప్పవచ్చు. అలాగే తెలుగులో ఆమెకు మరిన్ని అవకాశాలు క్యూ కట్టవచ్చు. ఇప్పటికే హీరోయిన్ రేంజ్‌లో ఆమెకు రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారట నిర్మాతలు. కాగా క్యారెక్టర్ ఆర్టిస్టు అయినా సరే అదీ ఆమె రేంజ్ అని పలువురు మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా హీరోయిన్లకు సమానమైన పారితోషకం అందుకోవచ్చని ఈ నటి నిరూపిస్తోంది.