నరేష్ పై రమ్య రఘుపతి సంచలన వ్యాఖ్యలు..!!

ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరో ,నటుడు వీకే నరేష్ గురించి పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా మరొక నటి పవిత్ర లోకేష్ వివాహం చేసుకోబోతున్నారనే విషయంపై ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయం హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. గడిచిన కొద్దిరోజుల క్రితం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా లిప్ కిస్ తో ఒక వీడియోని షేర్ చేస్తూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నామని తెలియజేశారు. దీంతో ఒక్కసారిగా నేటిజన్లు సైతం ఆశ్చర్యపోయారు. ఈ విషయంపై తాజాగా నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

Ramya Raghupathi, Ex-Wife of Actor V.K. Naresh, Embazzles Rs 40 Lakh; Case  Filed

తాజాగా ఒక ఇంటర్వ్యూలో రమ్య రఘుపతి మాట్లాడుతూ విడాకులలో మనీ మ్యాటర్ లేదని నా భర్త నాతోనే ఉండాలని నేను కోరానని తెలియజేసినట్లు తెలుపుతోంది. నేను ఇప్పటికీ అదే స్టాండు పై ఉన్నానని కూడా తెలుపుతోంది రమ్య రఘుపతి. కానీ నరేష్ మాత్రం తనతో విడాకులు తీసుకొని మరొక మహిళతో సెటిల్ కావాలని చేస్తున్నారని తెలియజేస్తోంది. నరేష్ కు సెల్ఫ్ రియలైజేషన్ వస్తుందేమో అని చూస్తున్నానని రమ్య రఘుపతి తెలియజేస్తోంది. ఆయనకు వన్ నైట్ స్టాండ్ అయ్యానని లీవ్ ఇన్ రిలేషన్షిప్ అయ్యానని పెళ్లి తర్వాత తెలిసిందని రమ్య రఘుపతి తెలియజేస్తుంది.

ఆయన ఎలాంటి తప్పులు చేసినా సరే నేను క్షమిస్తూ వస్తున్నానని.. అయితే తను ఎన్నోసార్లు తప్పు చేసినా కూడా క్షమించమని ఏడుస్తూ తన కాలు పట్టుకునే వారిని రమ్య రఘుపతి తెలియజేస్తుంది. అయితే కేవలం ఇంట్లో ఉంటే తన కొడుకు తన తండ్రిని చూసుకుంటాడని నమ్మకంతో ఉన్నట్లుగా తెలియజేస్తోంది. నరేష్ నేను రాఖీ కట్టిన వ్యక్తితో ఎఫైర్ ఉందని ప్రచారం చేశారని.. కేసుల వల్ల ఎన్జీవో కు దూరం కావాల్సి వచ్చిందని రమ్య రఘుపతి తెలియజేస్తోంది. రమ్య రఘుపతి చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.