నాతో ఆ ప‌ని చేసి చివ‌ర‌కు మోసం చేసేవారు.. ర‌కుల్ చేదు అనుభ‌వాలు!

రకుల్ ప్రీత్ సింగ్.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కన్నడలో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో సత్తా చాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. హిందీలో ఈమె నటించిన `ఛత్రివాలి` చిత్రం జనవరి 20న నేరుగా ఓటీటీలో విడుదల అయింది.

ఇందులో రకుల్ కండోమ్ టెస్టర్ గా నటించింది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్.. కెరీర్ ఆరంభంలో తనకు ఎదురైన‌ చేదు అనుభవాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. `ఇండస్ట్రీలో నాకు బ్యాక్‌గ్రౌండ్ లేదు. దాంతో ఛాన్స్ లు వచ్చినట్టే వచ్చి చేజారేవి. ఒక్కోసారి కొద్ది రోజులు నాతో షూటింగ్ చేసేవారు.

చివరకు అవకాశం ఇవ్వకుండా మోసం చేసి వేరే హీరోయిన్ ని తీసుకునేవారు. అయినా సరే నేను వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే కష్టపడకుండా ఈజీగా దక్కాలనుకునే మనస్తత్వం నాది కాదు. అందుకే ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేశాను. ఇప్పుడు ఈ స్థాయికి చేరుకోగలిగాను` అంటూ రకుల్ చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్‌ కాస్త నెట్టింట‌ వైరల్ గా మారాయి. కాగా, గ‌త ఏడాది నార్త్ లో వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అయిన ర‌కుల్.. ఈ ఏడాది అయినా స‌క్రెస్ ట్రాక్ ఎక్కుతుందా.. లేదా.. అన్న‌ది చూడాలి.