బాలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న షారుక్ ఖాన్ సినిమా కోసం ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురు చూశారు. ఎట్టకేలకు రీసెంట్గా ఈనెల 25న పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకున్నది.ఈ చిత్రం పూర్తిగా యాక్షన్ సినిమాగా తెరకెక్కించారు. విడుదలకు ముందు ఈ సినిమాకి సంబంధించి పోస్టర్లు, టీజర్, ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని కొన్ని దృశ్యాలు హిందూ సంస్థలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి.
అయినప్పటికీ కూడా ఆ వివాదాలను దాటి పఠాన్ సినిమా విడుదలై మంచి సక్సెస్ను అందుకుంది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ సినిమా దాదాపుగా రూ .50 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇప్పుడు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాతో బాలీవుడ్ కాస్త ఊపిరి పోసుకుందని చెప్పవచ్చు. ఈ సినిమా ఓటీటి రైట్స్ కి సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది. ప్రముఖ ఓటీటి సంస్థ ఈ సినిమాను వారి ధరకు కొనుగోలు చేసే విధంగా ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
అందుకోసం ఏకంగా డిజిటల్ రైట్స్ ను రూ .100 కోట్ల రూపాయలకు ఆఫర్ చేసినట్లు సమాచారం. దీంతో నిర్మాతలు కూడా ఈ డీల్ కు ఓకే చెప్పారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ వార్తలలో అసలు ఎంత నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 7వేలకు పైగా స్క్రీన్ లలో విడుదలయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా మంచి సక్సెస్ తో దూసుకుపోతోంది. మరి ఎంత మేరకు కలెక్షన్లు రాబడుతుందో చూడాలి మరి.