నందమూరి తారకతర్న గత శుక్రవారం కుప్పంలో `యువగళం` పాదయాత్రలో నారా లోకేష్ తో కలిసి నడుస్తూ గుండె పోటుటకు గురైన సంగతి తెలిసిందే. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యలు, కుటుంబసభ్యులు చెబుతున్నారు.
ఆయనకు గుండె సంబంధిత వ్యాధితో పాటు జీర్ణాశయ వ్యాధి కూడా ఉంది. ప్రస్తుతం ఎక్మో ట్రీట్మెంట్ ద్వారా శ్వాసను కృత్రిమంగా అందిస్తున్నారని తెలుస్తోంది. ఇకపోతే తారకరత్న ఆసుపత్రిలో ఉన్న సందర్భంగా ఆయనకు సంబంధించి ఎన్నో విషయాలు తెరపైకి వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన భార్య అలేఖ్య రెడ్డి గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
2012లో తారకరత్న పెద్దలను ఎదిరించి అలేఖ్య రెడ్డిని వివాహం చేసుకున్నారు. అయితే అలేఖ్య రెడ్డి అప్పటికే ఒక పెళ్లి అయింది. అలేఖ్య రెడ్డి మొదటి భర్త ఎవరో కాదు.. టీడీపీ మాజీ మంత్రి ఎలిమిరెడ్డి మాధవరెడ్డి కుమారుడు సందీప్ రెడ్డి. అలేఖ్య రెడ్డి మొదట సందీప్ రెడ్డిని వివాహం చేసుకుంది. అయితే పెళ్లి జరిగిన కొద్ది రోజులకే మనస్పర్థల కారణంలో అతడికి విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత తారకరత్నతో పరిచయం ఏర్పడగా.. అది ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. ఈ దంపతులకు ఒక కూతురు కూడా ఉంది.