అనుష్కపై మంచు లక్ష్మి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నదంటే..

మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ప్రసన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటిగా, నిర్మాతగా, యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మంచు లక్ష్మి అపుడప్పుడు బుల్లితెరపై కొన్ని రియాలిటీ షోస్, టాక్ షోస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తూ ఉంటుంది. ఇక ప్రస్తుతం లక్ష్మి మంచు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అయిన ఆహాలో ‘ఆహా భోజనంబూ’ అనే కుకింగ్ షో నిర్వహిస్తుంది.

ఇక ఈ షోకి సెలబ్రిటీలను తీసుకొచ్చి వారితో రకరకాల వంటలు చేయిస్తూనే వారికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు రాబడుతుంది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన మంచు లక్ష్మి హీరోయిన్ అనుష్కతో జరిగిన ఒక సంఘటన గురించి ప్రేక్షకులతో పంచుకుంది. లక్ష్మి మంచు మాట్లాడుతూ.. “అనుష్క శెట్టిని నా షోకి రమ్మని ఒకసారి పిలిచాను’. అప్పుడు తను కూడా సరే వస్తా అని చెప్పింది. ఆ తరువాత రెండు రోజుల వరకూ మా ఇద్దరికి మధ్య కాంటాక్ట్ లేదు. ఆ సమయంలో అనుష్క భాగమతి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రాజమండ్రిలో బిజీగా ఉంది. ఇక అపుడు నేను ఆమెను కాంటాక్ట్ అవడం కుదరలేదు. అప్పుడు నాకు ఒక చిన్న భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే అనుష్కతోనే నా షో స్టార్ట్ చేద్దామని నేను అనుకున్నాను. తనకోసం ఆమెకి పూలు పంపించాను, తన స్నేహితులకు ఫోన్ చేసాను. ఇలా అనుష్కని కాంటాక్ట్ అవడానికి చాలా రకాలుగా ప్రయత్నించాను…. ”

“భాగమతి ప్రమోషన్స్ నుంచి ఆమె తిరిగి వచ్చేసరికి అనుష్క ఇల్లు మొత్తం నా మెసేజ్ లతో నిండిపోయింది. అప్పుడు వెంటనే అనుష్క నాకు కాల్ చేసి నేను వస్తా అని చెప్పిన కదా అని అనింది. కానీ తను వస్తుందో రాదో అని నాకు చాలా భయం వేసింది. సెలెబ్రిటీలు నేను పిలవగానే వస్తున్నారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను పిలవగానే వెంటనే వచ్చే సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు. రానా, రకుల్, తాప్సీ లాంటి సెలెబ్రిటీలు నేను పిలిస్తే ఎక్కడున్నా వెంటనే వచ్చేస్తారు. వాళ్ళకి నా మీద అంత ప్రేమ ఉంది” అని లక్ష్మి మంచు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.