నాగార్జున వల్లే నిండా మోసపోయా అంటూ జబర్దస్త్ కమెడియన్ షాకింగ్ కామెంట్స్..!

ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఎందరో కమెడియన్లు బాగా పాపులర్ అయ్యారు. వారిలో జబర్దస్త్ రాము ఒకడు. ఈ కమెడియన్ అదిరే అభి టీమ్‌ స్కిట్స్‌లో కనిపిస్తుంటాడు. కొరియోగ్రాఫర్‌గా కూడా ఈ నటుడు పనిచేస్తుంటాడు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాము నాగార్జున గురించి సంచలన కామెంట్స్ చేశాడు. తన వల్లే తాను డబ్బులు నష్టపోయాయని వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు అతను చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

జబర్దస్త్ రాము ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “కొన్నేళ్ల క్రితం నేను డ్యాన్స్ బేబీ జూనియర్స్ షోలో వర్క్ చేశాను. ఆ షో చేస్తున్నప్పుడు ఒకరోజు అన్నపూర్ణ స్టూడియోలో కూర్చొని ఏడవడం మొదలుపెట్టాను. అప్పుడే నా దగ్గరికి నాగర్జున వచ్చాడు. దాంతో నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. నాగార్జున నాతో మాటలు కూడా కలిపాడు. ఎందుకు ఏడుస్తున్నావ్ అని ప్రశ్నించాడు. అలా మాటల్లో పడి తనకు సిగరెట్ కావాలని అడిగాడు. ఆ మాట వినగానే నాకు కొంచెం అనుమానం వచ్చింది. కానీ నాగార్జున నాతో మాట్లాడుతున్నాడనే ఆనందంతో అవేమీ పట్టించుకోకుండా వెంటనే షాప్ కి వెళ్లి సిగరెట్ కొనుక్కొని అతనికి తెచ్చి ఇచ్చాను. తర్వాత అతను అడిగినట్టు కూల్ డ్రింకు కూడా షాప్ నుంచి తీసుకొచ్చి వచ్చాను….”

“ఆ తర్వాత నాకు అసలు విషయం బోధపడింది. అదేంటంటే అతను నాగార్జున కాదు నాగార్జున లాగా కనిపించే అతని డూప్ అని. అలా నేను బాగా మోసపోయా. డబ్బులు కూడా నష్టపోయా. ఈ విషయం గురించి అసలైన నాగార్జునకి చెప్పి ఎలాగైనా అతన్నించే డబ్బులు కలెక్ట్ చేసుకుంటా.” అని జబర్దస్త్ రాము చెబుతూ అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు. అలాగే సినిమాల్లో అవకాశం కావాలంటే మూడు లక్షల చెల్లించాలని ఒక డైరెక్టర్ తనని అడిగినట్లు చెప్పి షాక్ ఇచ్చాడు ఆ డైరెక్టర్ పేరు తాను చెప్పదలుచుకోలేదని ఈ విషయం సస్పెన్స్ లో పెట్టాడు.