టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోయిన్గా తన హవా కొనసాగిస్తోంది శృతిహాసన్.. ఇమే చేస్తోంది ప్రస్తుతం రెండు సినిమాలు అయినప్పటికీ ఆ సినిమాలు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. ఈ సంక్రాంతి బరిలో చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య, బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాlut విడుదల కాబోతున్నాయి. ఈ రెండిట్లో కూడా ఈమె హీరోయిన్గా నటించింది. నిన్నటి రోజున వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ వేదికపై శృతిహాసన్ చీర కట్టులో అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈవెంట్ కే చాలా హైలైట్ గా నిలిచింది.
ప్రి రిలీజ్ ఈవెంట్లో శృతిహాసన్ మాట్లాడుతూ.. బాలకృష్ణ గారు ఎంతో పాజిటివ్గా..ఎంతో ఎనర్జిటిక్ హీరోగా గోల్డెన్ హార్ట్ ఉన్న హీరో అంటూ పొగడ్తలతో ముంచేసింది. ముఖ్యంగా జై బాలయ్య అంటూ శృతి నందమూరి అభిమానులను ఎంతగానో ఆనందపరిచింది. అంతేకాకుండా ఈ వేదికపై శృతిహాసన్ తన డైరెక్టర్ గోపీచంద్ మలినెనీ ప్రస్తావిస్తూ చాలా ఎమోషనల్ అయింది. తనకు సినీ పరిశ్రమలో అన్నయ్య గోపీచంద్ మల్లినేని ఉన్నారని అతనితో వరుసగా మూడు సినిమాలు చేశానని అది చాలా ఆనందాన్ని కలిగిస్తోందని తెలియజేస్తోంది శృతిహాసన్. ఇదే వేదికపై శృతి గురించి గోపీచంద్ మాట్లాడుతూ..
తన సోదర సహోదర ప్రేమను కనబరిచారు. తన కథానాయక గురించి చెబుతూ శృతిహాసన్ అద్భుతమైన నటి అని పొగిడేసారు. తనతో మూడు సినిమాలు చేశాను నా కెరియర్లో ఈమె లక్కీ హీరోయిన్గా మారిపోయింది.. శృతిహాసన్ ప్రతి సినిమాలో కూడా ఒక స్పెషల్ పర్ఫామెన్స్ చేస్తూ ఉంటుంది కామెడీ టైమింగ్ డాన్సులు అన్నిటిలోనూ తన స్టామినా చూపిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతుంది.