డైరెక్టర్‌గా మరో సినిమా తీయబోతున్న ధనుష్.. ఆ వివరాలు ఇవే..!

నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్‌ ఇండియా వైడ్‌గా పాపులర్ అయ్యాడు. చూసేందుకు చాలా సింపుల్‌గా కనిపించినా ధనుష్ నటన ముందు ఎవరైనా సరే దిగదిడుపే. ఈ హీరో యాక్ట్ చేసిన రీసెంట్ ఫిలిం వరువేన్‌ సినిమా పెద్దగా ఆడలేదు కానీ అతని నుంచి మంచి సినిమాలు వస్తున్నాయి. ధనుష్ ప్రస్తుతం వాతి, సర్, కెప్టెన్ మిల్లర్ సినిమాలను చేస్తున్నాడు. తమిళం, తెలుగు భాషల్లో వస్తున్న వాతి (తెలుగులో సార్‌) ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కెప్టెన్ మిల్లర్ సినిమా స్వాతంత్య్రానికి ముందు జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కనుంది. ఈ సినిమాలతో పాటు ధనుష్ శేఖర్ కమ్మల కలిసి ఒక తెలుగు సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఆల్రెడీ పూర్తయ్యాయి ఈ నేపథ్యంలోనే ధనుష్ డైరెక్టర్‌గా ఒక సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అలానే ఇందులో నలుగురు హీరోలతో కలిసి ధనుష్ నటించనున్నాడట. ధనుష్‌తో పాటు విష్ణు, ఎస్‌.జే.సూర్య, కాళిదాస్‌ జయరాం నటించనున్నట్లు సమాచారం.

ఈ మూవీని సన్‌ పిక్చర్స్‌ ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూస్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకి ‘రాయన్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు కోలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలానే ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ఆల్రెడీ స్టార్ట్ అయినట్లు.. త్వరలోనే ఆఫీసు అనౌన్స్‌మెంట్ కూడా వస్తుందన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ధనుష్ ఈ చిత్రంలో ఎక్స్‌టెండెడ్ కామియోలో కనిపించనున్నాడు. రిపోర్ట్స్ ప్రకారం, ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్తుంది. రాయన్ సినిమా 5 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత దర్శకుడిగా ధనుష్ రీ ఎంట్రీని సూచిస్తుంది. అలాగే ఇది అతనికి దర్శకుడిగా రెండో సినిమా అవుతుంది.