యాంకర్ అనసూయకి ఆ రోగం ఉందట.. విషయం తెలిసి ఫ్యాన్స్ షాక్..

యాంకర్ అనసూయ హీరోయిన్లకు సమానమైన పాపులారిటీని సంపాదించిందని అనడంలో సందేహం లేదు. ఈ ముద్దుగుమ్మ టీవీ షోలలో యాంకర్‌గా చేస్తూనే సినిమాల్లో నటిస్తూ చాలామందికి దగ్గర అయింది. సోషల్ మీడియా ద్వారా కూడా ఈ ముద్దుగుమ్మ అభిమానులతో టచ్ లో ఉంటూ తన పాపులారిటీ పెంచుకుంటోంది. ఈ తార తరచూ తన హాట్ ఫొటోలు, విశేషాలను సోషల్ మీడియా ద్వారానే షేర్ చేసుకుంటుంది. కాగా తాజాగా ఆమె తనకు ఒక రోగం ఉన్నట్లు వెల్లడించింది. దాంతో అందరూ షాక్ అవుతారు ఇంతకీ ఏంటా రోగం..?

అనసూయ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పంచుకుంది. ఈ వీడియోలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ తానొక డిజార్డర్‌తో సఫర్ అవుతున్నానని చెప్పింది. ఈ వీడియోలో అనసూయ ఒక వాయిస్‌కి లిప్ సింక్ ఇస్తూ ‘ఐ సఫర్ ఫ్రమ్‌ థట్ డిజార్డర్ వేర్ ఐ టెల్ ది ట్రూత్ అండ్ థట్ పిస్సెస్ ఆఫ్ పీపుల్’ అని చెప్పింది. అంటే దీని అర్థం ఇతర వ్యక్తులకు కోపం లేదా కలత కలిగించేంత నిజాయితీగా, బహిరంగంగా మాట్లాడే ధోరణి తనకి ఉంటుందని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. అదే తన డిజార్డర్ అంటే రోగం లేదా వ్యాధి అని పేర్కొంది.

 

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

ఎవరు కూడా ఎప్పుడూ అన్ని నిజాలు చెప్పలేరు కానీ అనసూయ తనకి నిజం చెప్పే రోగం ఉందంటూ అందరి ముందు ఒప్పుకొని చాలామందిని షాక్కి గురిచేస్తుంది. ఇక ప్రస్తుతం అనసూయ పుష్ప 2, కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాల్లో నటిస్తోంది. అలాగే గురజాడ అప్పారావు నాటకం ‘కన్యాశుల్కం’ నవల ఆధారంగా తెరకెక్కుతోన్న కన్యాశుల్కం వెబ్‌సిరీస్‌లోనూ యాక్ట్ చేస్తోంది. ఇందులో ఈ హాట్ భామ వేశ్య వేషం వేస్తోంది.