మలయాళం సినిమాలలో నటిస్తూ మంచి పాపులారిటీ అందుకుంది హీరోయిన్ అమలాపాల్. మలయాళం తోపాటు తెలుగు, తమిళ్ ,కన్నడ భాషలలో నటించి అలరించింది. ప్రస్తుతం తమిళ్, మలయాళం వంటి భాషలలో పలు సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. అమలాపాల్ చేతిలో ప్రస్తుతం అరుడజనుకుపైగా సినిమాలు ఉన్నాయి. యాక్టర్ గానే కాకుండా నిర్మాతగా ప్రొడక్షన్ హౌస్ ని కూడా మొదలు పెట్టింది. వీటి మీద పలు సినిమాలను నిర్మిస్తోంది అమలాపాల్. వీటితోపాటు పలు వెబ్ సిరీస్లను కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ హీరోయిన్ కి ఒక చేదు అనుభవం ఎదురైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కేరళలోని ఎర్నాకులంలో ఉన్న తీరువైరానికులం మహాదేవ ఆలయాన్ని దర్శించుకోవడం కోసం వెళ్లిన అమలాపాల్ ని అక్కడ కొంతమంది నిర్వాహకులు అడ్డుకున్నట్లు సమాచారం .ఆలయంలో హిందువులకు మాత్రమే అనుమతి ఉందని.. మీరు క్రిస్టియన్ అంటూ ఈ ఆలయ పూజారులు ఆమెను అడ్డుకున్నారు.. దీంతో అమలపాల్ ఆలయం ముందు నుంచి దేవుడికి మొక్కుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అయితే ఈ విషయాన్ని ఆలయం విజిటర్ బుక్లో ఎంట్రీ చేసింది.
నన్ను ఆలయంలోకి అనుమతించకపోయినా మనసులో ప్రార్థించుకొని దేవుని ఆశీస్సులు పొందినట్లు తెలియజేసింది అమలాపాల్.2023 లో కూడా ఇంకా మతపరమైన వివక్షత కొనసాగడం చాలా బాధాకరంగా ఉందని.. ఈ వివక్ష వెంటనే తొలగించాలంటే రాసుకుంది. లౌకిక రాజ్యమని చెప్పుకుంటూ ఈ వివక్ష ఏంటని కూడా సూటు ప్రశ్నలు వేసింది అమలాపాల్. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది .మరి ఈ విషయంపై అక్కడ ఉన్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది. అమలాపాల్ చేతిలో ప్రస్తుతం క్రిస్టోఫర్ సినిమాతో పాటు ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాతో పాటు అజయ్ దేవగన్తో కూడా నటిస్తున్నట్లు సమాచారం.