నందమూరి నటుడు తారకరత్న ప్రతి ఒక్కరికి సుపరిచితమే. మొదట ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి పరిచయమైన తారకరత్న ఆ తర్వాత ఒకేసారి 9 సినిమాలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ ఘనత ఇప్పటికీ ఏ హీరో కూడా అందుకోలేరని చెప్పవచ్చు. కానీ సినిమాలలో సక్సెస్ కాలేకపోయినా తారకరత్న పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించారు. అలాగే పలు చిత్రాలలో విలన్ గా కూడా నటించి మెప్పించారు. ఇక సినిమాలు వదిలేసి రాజకీయంగా అటువైపుగా వెళ్లారు. అలా గడిచిన రెండు రోజుల క్రితం నారా లోకేష్ మొదలుపెట్టిన యువ గలం పేరుతో పాదయాత్రను మొదలుపెట్టారు.
ఈ పాదయాత్ర నటుడు తారకరత్న దగ్గరుండి చూసుకున్నారు.. అలాంటి సమయంలోనే లోకేష్ తో కలిసి పాదయాత్ర చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోవడం జరిగింది.
దీంతో అక్కడున్న టిడిపి, నందమూరి అభిమానుల సైతం వెంటనే కుప్పం ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయ హాస్పిటల్ కి తరలించారు. ఈ తరుణంలోనే తారకరత్న ఆరోగ్యం పైన పలు రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న వార్త నందమూరి తారకరత్న ను ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హాస్పిటల్ లోకి వెళ్లి చూడగా నిన్నటి కంటే ఇవాళ ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగైనట్లుగా తెలియజేశారు. తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారు.. విదేశాల నుండి ఒక స్పెషల్ బ్రెయిన్ డాక్టర్ను కూడా పిలిపించాము తెలియజేశారు కర్ణాటక ఆరోగ్య మంత్రి సుధాకర్. తాజాగా కొన్ని నిమిషాల క్రితం వైద్యులు తెలిపిన ప్రకారం చికిత్సకు తారకరత్న శరీర స్పందిస్తున్నట్లుగా వైద్యులు వెల్లడించారు ఇవాళ చేసి వైద్య పరీక్షలు చాలా కీలకమని కూడా తెలియజేశారు.