సినీ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగిన వారిలో చిరంజీవి మొదటి వరుస లో ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా అభిమానులకు తన వంతు సహాయం చేస్తూ సాధారణ ప్రజల ప్రశంసలు అందుకుంటూ ఉంటారు. రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కాలేకపోయినా చిరంజీవి మాత్రం మంచి పనులు చేస్తూ ఉన్నారు. చిరంజీవి కొన్ని కారణాలవల్ల రాజకీయాలకు దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే చిరంజీవి ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాలలో కొనసాగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. చిరంజీవి కొన్ని నెలల క్రితం కార్మికులకు ప్రయోజనం చేకూరాలని ఆసుపత్రి నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నారని వార్తలు వినిపించాయి.
కానీ గతంలో కూడా ప్రముఖ టాలీవుడ్ సీనియర్ లక్షలలో ఒకరైన ప్రభాకర్ రెడ్డి కూతురు శైలజ కూడా చిత్రపూరి కాలనీకి చెందిన కార్మికుల కోసం ఒక హాస్పెటల్ని నిర్మించాలని భావించిందట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శైలజ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. గత నెల 29వ తేదీన..MIG HIG ఫ్లాట్ సామూహిక గృహప్రవేశాల మహోత్సవం జరగగా ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందకపోవడం తన తల్లిని చాలా బాధకు గురి చేసిందని శైలజ తెలియజేయడం జరుగుతోంది.
ఫౌండర్ అయిన మాకు ఆహ్వానం అందకపోవడం సరికాదని కూడా ఆమె తెలియజేస్తోంది.నాన్న పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి తమ కుటుంబ సభ్యులను ఆహ్వానించకపోవడం చాలా బాధాకరమని తెలుపుతోంది.కార్మికుల కోసమే మేము ఆసుపత్రిని నిర్మించాలని భావిస్తుంటే.. చిరంజీవి పేరు చెప్పి వెనక్కు నడుతున్నారని శైలజ తెలియజేస్తోంది. శైలజ చెప్పిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో శైలజానే స్వయంగా ఆసుపత్రి నిర్మిస్తుందేమో చూడాలి.