మరాఠీ ఇండస్ట్రీకి చెందిన ఒక హీరోయిన్ తాజాగా తను లైంగికంగ ఎదురైనా ఒక సంఘటన గురించి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడం జరిగింది. తాను ఉంటున్న ఇల్లు అద్దె ఇల్లు అయితే ఆ ఇంటికి అద్దె చెల్లించేందుకు ఓనర్ వద్దకు వెళ్లగా ఆ వ్యక్తి తనను డైరెక్ట్ గా రూమ్ లోకి రమ్మన్నాడు అంటూ పలు సంచలన ఆరోపణలు తెలియజేస్తోంది .ప్రస్తుతం ఇమే చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మరాఠి హీరోయిన్ తేజస్విని పండిట్ ఈమె నటి జ్యోతి చందేకర్ కుమార్తె. 2004వ సంవత్సరంలో కేదార్ షిండే తో వెండితెరకు పరిచయమైంది అయితే ఇమే 2009 వ సంవత్సరంలో పూణేలో సింహగడ్ రోడ్డులో ఒక ఇంటిలో అద్దెకు ఉన్నట్లుగా తెలియజేస్తోంది .ఆ సమయంలోనే ఆ ఇంటి ఓనర్ తనపైన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరుగుతోంది. తాను అపార్ట్మెంట్లో ఉంటున్న సమయంలో తనని కేవలం రెండు సినిమాలు మాత్రమే విడుదలయ్యాయని అయితే తన నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ ఒక కార్పొరేట్ కు చెందిన వ్యక్తితని తెలిపింది.
ఈ క్రమంలోనే తాను ఇంటి అద్దెను చెల్లించడానికి అతని కార్యాలయానికి వెళ్ళగా ఆక్రమంలోనే అతను నేరుగా తనను రూమ్ లోకి రమ్మని ఆఫర్ ఇచ్చాడని తెలుపుతోంది. ఆ సమయంలో అతని టేబుల్ పైన ఒక గ్లాసు నీరు ఉంచగా దానిని తీసుకొని అతడు ముఖం మీద కొట్టి తాను ఇలాంటి పనులు చేయనని ముఖానే చెప్పేశానని తెలియజేస్తోంది.. ఆర్థికంగా బలహీనంగా ఉండడం వల్ల ఆ కార్పొరేటర్ అలా తనతో అసభ్యంగా ప్రవర్తించాలని తెలియజేస్తోంది. అయితే ఆ వెంటనే అపార్ట్మెంట్ను ఖాళీ చేసి బయటికి వచ్చేసానని తేజస్విని తెలుపుతోంది.