బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి ఇప్పటికీ కొన్ని సంవత్సరాలు అవుతున్న ఇంకా ఈ నటుడిది హత్యలేక ఆత్మహత్య అనే కోణంలో విచారణ జరుగుతూనే ఉన్నది. మొదట ముంబై పోలీసులు కేసు దర్యాప్తు చేసినప్పుడు ఆ తర్వాత ఒత్తిడి పెరగడంతో ఈ కేసును సిబిఐకి అప్పగించినట్లు వార్తలు వినిపించాయి. ఇప్పటివరకు ఈ విచారణ ఇంకా పూర్తి కాలేదు. దీనిపై కూడా తీవ్ర ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి పైన హత్య ఆరోపణలు కూడా ఎక్కువగా వినిపించాయి. కానీ ఈ నటుడు పోస్టుమార్టం లో మాత్రం సూపర్ హాస్పిటల్ లో సిబ్బంది ఇప్పుడు చేసిన ఒక సంచలన ప్రకటన వైరల్ గా మారుతోంది.
అసలు విషయంలోకి వెళ్తే..సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోలేదని హత్య చేసుకున్నారని కూపర్ హాస్పిటల్ లోని మార్చరీలో పనిచేసే రూప కుమార్ షా ఆరోపించారు. సుశాంత్ సింగ్ మృతదేహం వచ్చినప్పుడు అతని శరీరం పైన తీవ్రమైన గాయాలు ఉన్నాయని అతడిని ఎవరో కొట్టినట్లుగా గాయాలు ఉన్నాయని రూప కుమార్ తెలిపారు. సుశాంత్ సింగ్ మృతదేహాన్ని పోస్ట్ మాస్టర్ జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను ఇది ఆత్మహత్య కాదని హత్య అనే డాక్టర్కు చెప్పానని కానీ ఎవరు తనని పట్టించుకోలేదని రూప కుమార్ తెలిపారు. దీంతో సుశాంత్ అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు.
అయితే ఈ విషయాన్ని ఇంతకాలం ఎందుకు దాచారు అనే విషయంపై మాట్లాడుతూ.. పనిలో ఎవరికీ ఇబ్బంది కలగకూడదని ఉద్దేశంతో ఇంత వరకు నేను మాట్లాడలేదు.. అన్నారు. కూపర్ హాస్పిటల్ లో మార్చరీలో రూప కుమార్ పనిచేసినట్లు తెలుస్తోంది. ఈమధ్య పదవి విరమణ చేసినట్లుగా సమాచారం. ఈ కేసులో సుశాంత్ సింగ్ స్నేహితులు రియా చక్రవర్తి ప్రధాన నిందితులుగా ఉన్నారు. మరి ఈ విషయం ఇంకా ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి మరి.