శాకుంతలం సినిమాను చూసిన సమంత.. ఏమనిందంటే..!!

టాలీవుడ్ లో హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఈ మధ్యకాలంలో మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. అయినా కూడా పలు చిత్రాలలో నటించేందుకు ఇమే ఆసక్తి చూపిస్తోంది. రీసెంట్గా విడుదలైన యశోద చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విషయాన్ని అందుకుంది. ఇక సమంత నటించిన చిత్రాలలో శాకుంతలం సినిమా కూడా ఒకటి. ఈ సినిమా డైరెక్టర్ గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రంతో సమంత రేంజ్ మరొకసారి మారిపోతుందని చిత్ర బృందం గతంలో ఎన్నోసార్లు తెలియజేశారు.

Samantha unhappy with Shakunthalam? Makers' official statement - Tamil News  - IndiaGlitz.com
అయితే నిన్నటి రోజున సమంత అన్నపూర్ణ స్టూడియోలో కనిపించిందని అక్కడ ప్రీవ్యూ థియేటర్ల శాకుంతలం సినిమాను చూసిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో తన సినిమా పైన కాన్ఫిడెంట్ లెవెల్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సమంత అనుకున్నట్లుగానే ఈ చిత్రం వచ్చిందని చెప్పకనే చెప్పినట్లుగా సమాచారం. ఇక విడుదల తర్వాత ఈమె రేంజ్ మారటం ఒకటే బ్యాలెన్స్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మయోసైటీస్ వ్యాధి వల్ల సమంత శరీరంలో పలు మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. అది చూసిన అభిమానులు ఒక్కసారిగా కంగారుపడ్డారు కానీ నిన్నటి రోజున సమంత మళ్ళీ పూర్వ వైభవాన్ని కలిగినట్లుగా ఆమెను చూసిన కొంతమంది ప్రేక్షకులు తెలియజేస్తున్నారు.

సమంత మెడిసిన్ అనంతరం బయటికి రావడం మీడియాకు చిక్కడం కూడా ఇదే మొదటిసారి. మునుపటికన్నా సమంత మరింత అందంగా కనిపిస్తోందని తెలియజేస్తున్నారు. కొన్ని నెలలుగా ఈమె సినిమా విషయంలో ఏం జరుగుతుందో క్లారిటీ లేకుండా పోయింది.ఇప్పుడు షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. మరి రాబోయే రోజుల్లో సమంత యధావిధిగా తన సినిమా షూటింగ్ వల్ల పాల్గొంటుందేమో చూడాలి మరి.